Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రధాని కోరారు.. అమీర్ పాటించారు, పుట్టినరోజున ప్రజలకు సందేశం, నెక్ట్స్ మూవీ...
బాలీవుడ్ సూపర్ స్టార్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నేడు(మార్చి 14) తన 54వ పుట్టినరోజు వేడుక మీడియాతో కలిసి జరుపుకున్నారు. బాంద్రాలోని తన నివాసంలో భార్య కిరణ్ రావుతో కలిసి కేక్ కట్ చేసి వేడుక చేసుకున్నారు.
తన పుట్టినరోజు సందర్భంగా అమీర్ అభిమానులతో పాటు భారతీయులందరికీ ఒక ముఖ్యమైన సందేశం పంపారు. ఇది ఎన్నికల సంవత్సరం, భారత దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకుని ఎన్నికలను విజయవంతం చేయాలని కోరారు.
ప్రధాని కోరారు.. అమీర్ ఖాన్ పాటించారు
రెండు రోజుల క్రితమే భారత ప్రధాని నరేంద్ర మోడీ.. అమీర్ ఖాన్తో పాటు పలువురు సినీ స్టార్లును ఉద్దేశించి ట్వీట్ చేస్తూ లోక్ సభ ఎన్నికల్లో ప్రజలను ఓటు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా మోటివేట్ చేయాలని కోరిన సంగతి తెలిసిందే.
ఏ రాజకీయ పార్టీని ప్రమోట్ చేయడం లేదు
ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ బీజేపీని ప్రమోట్ చేస్తున్నారనే వాదన తెరపైకి వచ్చింది. మీరు భారతీయ జనతా పార్టీని ప్రమోట్ చేస్తున్నారా? అనే ప్రశ్నకు అమీర్ ఖాన్ స్పందిస్తూ... ‘అలాంటిదేమీ లేదు. నేను ఏ రాజకీయ పార్టీని ప్రమోట్ చేయడం లేదు' అని స్పష్టం చేశారు.
క్రేజీ హీరోయిన్ గర్భవతా.. ఆసుపత్రిలో సీక్రెట్గా.. అసలేం జరిగిందంటే!
వారికి కూడా ఓటు వేసే అవకాశం కల్పించాలి
ఈ సందర్భంగా అమీర్ ఖాన్... విదేశాల్లో ఉండే భారతీయులకు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాటు చేయాలని కోరారు. చాలా మంది ఇండియన్స్ విదేశాల్లో నివసిస్తున్నారు. అక్కడ పని చేస్తున్నారు. వారికి ఓటు వేయాలని ఉంటుంది కానీ ఇక్కడకు రాలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వారు ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల కమీషన్ ఏర్పాట్లు చేస్తే బావుంటుందన్నారు.
తన తర్వాతి ప్రాజెక్ట్ గురించి..
‘థగ్స్ హిందూస్తాన్' తర్వాత తాను చేయబోతున్న సినిమా ‘లాల్ సింగ్ చాదా' అని అమీర్ ఖాన్ వెల్లడించారు. ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తారని, 2020లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు.