Don't Miss!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సచిన్ కోసం కామెంటేటర్గా మారిన మిస్టర్ పర్ఫెక్ట్!
ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వీరాభిమానుల్లో ఒకరైన బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సచిన ఆడుతున్న 200వ టెస్టు, చివరి టెస్టు మ్యాచ్ చూసేందుకు ఈ రోజు ముంబైలోని వాంఖడే స్టేడియంకు చేరుకున్నారు. కేవలం మ్యాచ్ చూడటం మాత్రమే కాదు....కామెంట్రీ బాక్సులో కూర్చుని కామెంటేటర్గా మారాడు అమీర్ ఖాన్.
మైక్ అందుకున్న అమీర్ ఖాన్...ఇండియన్ క్రికెట్గాడ్ను పొగడ్తలతో ముంచెత్తాడు. త్వరలో 'ధూమ్-3' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అమీర్ ఖాన్....ఇటీవల విడుదలైన తన సినిమా సాంగ్ 'ధూమ్ మచాలే'ను సచిన్కు అంకితం చేసిన సంగతి తెలిసిందే. అమీర్ లాంటి స్టార్ కామెంటేటర్గా మారడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
చాలా ఏళ్ల నుంచి అమీర్ ఖాన్, సచిన్ టెండూల్కర్ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. సచిన్ గురించి అమీర్ ఖాన్ మాట్లాడుతూ...సచిన్ కేవలం గొప్ప ఆటగాడు మాత్రమే కాదు, గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన తన ఆటతో దేశ కీర్తి ప్రతిష్టలు పెంచాడు. కోట్లాది మంది భారతీయులకు ఆదర్శంగా నిలిచాడు' వ్యాఖ్యానించారు.
'సచిన్ లాంటి స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్ అంటే క్రికెట్ అభిమానులకు వెలితిగా ఉండటం సహజమే. కానీ సచిన్ చివరి మ్యాచ్ను అభిమానులంతా ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు' అని అమీర్ ఖాన్ను అన్నారు. సచిన్ లాస్ట్ ఇన్నింగ్స్ బెస్ట్గా ఉండాలని ఆకాక్షించాడు. సచిన్కు తాను అభిమానిని అని ఎంతో గొప్పగా చెప్పుకుంటూ మురిసిపోయాడు ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్!