Don't Miss!
- News గేదెల మందులమ్మేవాళ్లు వైసీపీకి సర్వే చేశారంట?
- Sports Rohit x Hardik: పదేళ్లుగా కెప్టెన్సీ చేశా.. ఎలా గెలవాలో తెలుసు- రోహిత్
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నేను ఆస్కార్ కోసం సినిమాలు తీయను
నేను ఆస్కార్ పురస్కారాల కోసం సినిమాలు తీయను. అలాగే ఏ అవార్డులూ ఆశించి చిత్ర నిర్మాణం చేపట్టలేదు. ప్రేక్షకుల కోసమే సినిమాలు తీస్తాను అన్నారు అమీర్ ఖాన్. ఆయన నిర్మించిన 'పీప్లి లైవ్' చిత్రం విదేశీ ఉత్తమ చిత్రం విభాగంలో ఆస్కార్ అవార్డు కోసం పోటీపడింది. కానీ ఫైనల్ లిస్ట్ లో స్థానం దక్కించుకోలేకపోయింది. దీనిపై అమీర్ ఇలా స్పందించారు. అలాగే 'పీప్లి లైవ్' చిత్రం ఆస్కార్ బరిలో చివరి వరకూ నిలువలేకపోవడం పట్ల కొంచెం బాధ కలిగిన మాట వాస్తవమే. కానీ మీడియా నుంచి, ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి వచ్చే సూచనలు, పొగడ్తల్నే నాకు ఆనందాన్ని కలగచేసాయి.
దాదాపు ప్రపంచంలోని 60 ఉత్తమ చిత్రాల్లో 'పీప్లి లైవ్' కూడా ప్రాథమిక దశ దాటడం గర్వించదగ్గ విషయం. కేన్స్, ఆస్కార్, బెర్లిన్ లాంటి చిత్రోత్సవాల్లో ప్రశంసలు పొందితే..మన సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చి.. అధిక సంఖ్యలో ప్రేక్షకులు సినిమా చూస్తారు'' అన్నారు. ఎన్ డి టివిలో జర్నలిస్టుగా ఉన్న అనూష రిజ్విని దర్శకత్వంలో అమీర్ ఖాన్ 'పీప్లి లైవ్' అనే సినిమాను నిర్మించారు. రైతుల ఆత్మహత్యలు..రాజకీయ నాయకుల ఓదార్పులు..వాటిపై మీడియా కథనాలు.. వీటి చుట్టూ అల్లుకొన్న కథ ఇది. ఈ చిత్రంలో రఘుబీర్ యాదవ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, మలైకా షెనాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.