Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చైనాలో ‘పికె’ కలెక్షన్ల రికార్డు: బాహుబలి నిర్మాతల్లో ఆశలు!
హైదరాబాద్: అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పికె' చిత్రం ఇండియాలో మంచి విజయం సాధించింది. ఈ చిత్రం చైనీస్ లాంగ్వేజ్ లోకి అనువాదమై గత శుక్రవారం చైనా వ్యాప్తంగా 4,600 థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రం ఇక్కడ మన కరెన్సీ లెక్కల ప్రకారం రూ. 178.34 కోట్లు వసూలు చేసింది. ఒక భారతీయ సినిమా చైనాలో ఈ రేంజిలో వసూళ్లు సాధించడం ఇదే ప్రథమం. గతంలో అమీర్ ఖాన్ ‘3 ఇడియట్స్' సినిమా కూడా చైనాలో మంచి విజయం సాధించింది.
చైనాలో భారతీయ సినిమాలకు మంచి ఆదరణ ఉన్న నేపథ్యాన్ని గమనించిన ‘బాహుబలి' చిత్ర యూనిట్ సినిమాను చైనాలోనూ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా పికె కలెక్షన్లు వారి ‘బాహుబలి' మేకర్స్ లో నూతన ఉత్సాహాన్ని నింపించింది. చైనాతో పాటు ఇంగ్లీష్, ఇతర విదేశీ భాషల్లోనూ ‘బాహుబలి' సినిమా విడుదల కాబోతోంది.
ఇందులో భాగంగా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అభిమానులకు పరిచయం చేయడానికి కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని వేదికగా చేసుకొంది. శోభు యార్లగడ్డ, ఛాయాగ్రాహకుడు కె.కె.సెంథిల్కుమార్, ఎస్.ఎస్.కార్తికేయ ఆధ్వర్యంలో ఓ బృందం కేన్స్కు వెళ్లింది. అక్కడ కేన్స్ ప్రతినిధి క్రిస్టియన్ జేన్ను కలిశారు.