Don't Miss!
- Finance Sensex News: 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. దలాల్స్ట్రీట్ దున్నేస్తున్న బుల్స్..
- News ఏపీలో విపక్షాల ఫిర్యాదుల వేళ ఈసీ కీలక నిర్ణయం..! రంగంలోకి ఆ ముగ్గురు..
- Sports క్లాసెన్కు కావ్య మారన్ స్పెషల్ గిఫ్ట్!
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
అమీర్ ఖాన్ తాజా చిత్రం 'పీప్లి లైవ్' డైరక్టర్ గురించి...
జర్నలిస్టుగా ఉన్న అనూష రిజ్విని దర్శకత్వంలో అమీర్ ఖాన్ 'పీప్లి లైవ్' అనే సినిమాను నిర్మించారు. రైతుల ఆత్మహత్యలు..రాజకీయ నాయకుల ఓదార్పులు..వాటిపై మీడియా కథనాలు.. వీటి చుట్టూ అల్లుకొన్న కథ ఇది. ఈ నెల 13న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో ఈ సినిమాను 200 ప్రింట్లతో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్బంగా అమీర్ ఖాన్..ఆ మహిళా దర్శకురాలి గురించి తెలియచేసారు. ఆయన మాటల్లో..నేను 'మంగళ్ పాండే' సినిమా చేస్తున్న సమయంలో నాకో మెయిల్ వచ్చింది. అందులోని సారాంశం..నా దగ్గర మంచి కథ ఉంది. సినిమా తీస్తారా అని! నేను పెద్దగా పట్టించుకోలేదు.
ఆ తరవాత కొన్నాళ్లకు 'నా పేరు అనూష రిజ్వి. నేను ఎన్డీటీవీలో జర్నలిస్టును. మీకు కథ వినిపించాలనుకొంటున్నాన'ని మళ్లీ మెయిల్ వచ్చింది. ఈ సారి కొంచెం సీరియస్గా తీసుకొన్నాను. అప్పటికే నేను 'రంగ్ దె బసంతి' సినిమా చేస్తున్నాను. ఢిల్లీలో ఉండగా ఓ రోజు కథ వినిపించమని ఆమెను కోరాను. విన్న తరవాత నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి. వాటిని నివృత్తి చేయమని..స్క్రిప్టు మరింత పక్కాగా తయారు చేసుకొని రమ్మని చెప్పాను. రెండోసారి కలిసినప్పుడు నేను సినిమా నిర్మించడానికి ఒప్పుకొన్నాను అన్నారు. ఇక ఈ చిత్రంలో రఘుబీర్ యాదవ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, మలైకా షెనాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.