twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమీర్ ఖాన్ తాజా చిత్రం 'పీప్లి లైవ్‌' డైరక్టర్ గురించి...

    By Srikanya
    |

    జర్నలిస్టుగా ఉన్న అనూష రిజ్విని దర్శకత్వంలో అమీర్ ఖాన్ 'పీప్లి లైవ్‌' అనే సినిమాను నిర్మించారు. రైతుల ఆత్మహత్యలు..రాజకీయ నాయకుల ఓదార్పులు..వాటిపై మీడియా కథనాలు.. వీటి చుట్టూ అల్లుకొన్న కథ ఇది. ఈ నెల 13న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌ లో ఈ సినిమాను 200 ప్రింట్లతో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్బంగా అమీర్ ఖాన్..ఆ మహిళా దర్శకురాలి గురించి తెలియచేసారు. ఆయన మాటల్లో..నేను 'మంగళ్‌ పాండే' సినిమా చేస్తున్న సమయంలో నాకో మెయిల్‌ వచ్చింది. అందులోని సారాంశం..నా దగ్గర మంచి కథ ఉంది. సినిమా తీస్తారా అని! నేను పెద్దగా పట్టించుకోలేదు.

    ఆ తరవాత కొన్నాళ్లకు 'నా పేరు అనూష రిజ్వి. నేను ఎన్‌డీటీవీలో జర్నలిస్టును. మీకు కథ వినిపించాలనుకొంటున్నాన'ని మళ్లీ మెయిల్‌ వచ్చింది. ఈ సారి కొంచెం సీరియస్‌గా తీసుకొన్నాను. అప్పటికే నేను 'రంగ్‌ దె బసంతి' సినిమా చేస్తున్నాను. ఢిల్లీలో ఉండగా ఓ రోజు కథ వినిపించమని ఆమెను కోరాను. విన్న తరవాత నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి. వాటిని నివృత్తి చేయమని..స్క్రిప్టు మరింత పక్కాగా తయారు చేసుకొని రమ్మని చెప్పాను. రెండోసారి కలిసినప్పుడు నేను సినిమా నిర్మించడానికి ఒప్పుకొన్నాను అన్నారు. ఇక ఈ చిత్రంలో రఘుబీర్‌ యాదవ్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, మలైకా షెనాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X