ఆర్తి అగర్వాల్ మళ్ళీ మొదలెట్టింది

ఆలిండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సిహెచ్. సుధాకరబాబు తన పదవ చిత్రం నిర్మాణ సన్నాహాలు ప్రారంభించారు. హీరోయిన్ ఓరియంటెడ్ కథాంశంతో రూపుదిద్దుకునే ఈ చిత్రంలో ఆర్తీ అగర్వాల్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. ఈ విషయాన్ని నిర్మాత వెల్లడిస్తూ' తెలుగులో రీ ఎంట్రీ అవుతున్న ఆర్తీ అగర్వాల్ తను ఇంతవరకూ పోషించిన పాత్రలకు భిన్నమైన కేరెక్టర్ను ఈ చిత్రంలో చేస్తోంది.
రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్గా రూపుదిద్దుకునే ఈ చిత్రం షూటింగ్ జూన్లో ప్రారంభమవుతుంది. హైదరాబాదు, చెన్నైలలో జరిగే సింగిల్ షెడ్యూల్తో చిత్ర నిర్మాణం పూర్తవుతుంది. సినిమాలో 5 ఫైట్లు ఉంటాయి. మిగిలిన వివరాలు త్వరలో వెల్లడిస్తాను' అన్నారు. ఈ సందర్భంగా ఆర్తీ అగర్వాల్ మాట్లాడుతూ 'దర్శకుడు వి.వి.ప్రసాద్ చెప్పిన ఈ కథ బాగా నచ్చింది.
నాలుగైదు ఆఫర్లు వచ్చినప్పటికీ నా రీ ఎంట్రీకి ఇదే సరైన స్క్రిప్ట్ అని భావించి ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. ఇంతవరకూ నేను చేయని పాత్రను ఇందులో చేస్తున్నాను' అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: టి.మోహన్రెడ్డి (యు.ఎస్.ఎ.), నిర్మాత: సిహెచ్.సుధాకరబాబు, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: వి.వి.ప్రసాద్. అదీ సంగతి మళ్ళీ ఆర్తి మొదలెట్టింది. ఇక రెగ్యులర్ గా తెరను పలకరిస్తుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications











