Don't Miss!
- News భారత్లో పెట్టుబడులపై ఎలాన్ మస్క్ యూటర్న్?
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
'రక్ష' చిత్రం భయపెట్టలేదనే ...రామ్ గోపాల్ వర్మ
'ఆమధ్య నేను రూపొందించిన 'రక్ష' ప్రేక్షకులను అనుకున్నంతగా భయపెట్టలేదన్న వాదన ఉంది. ఆ లోటును పూడ్చుకోవడానికి రూపొందిస్తున్న చిత్రమే 'ఆవహం'. ఈ చిత్రం అందర్నీ భయపెడుతుంది' అంటున్నారు రామ్గోపాల్వర్మ. అలాగే 'ఆవహం' చిత్రం కథ దర్శకుడు నేరేట్ చేస్తున్నప్పుడే తనను భయపెట్టిందని, అది ప్రేక్షకులు కూడా ఫీలవుతారని భావిస్తున్నానని అన్నారు. తెలుగులో రక్ష చిత్రాన్ని వంశీకృష్ణ డైరక్ట్ చేసారు. యండమూరి తులసీ దళం ఆదారంగా ఆ చిత్రం రూపొందినట్లు ప్రచారం చేసారు.
ఆయన సమర్పణలో మిలింద్ గడాక్కర్ దర్శకత్వంలో సార్థక్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, జడ్ త్రీ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న 'ఆవహం' చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. సుదీప్, అమృత కన్విల్కర్, ఎహసాస్ చన్నా, రిషబ్ జైన్, అను అన్సారీ, గణేష్ యాదవ్ ఈ చిత్రంలోని ప్రధాన తారాగణం. ఇక ఈ చిత్రం హిందీలో ఫూంక్ 2 గానూ, తమిళంలో బొమ్మై 2 టైటిల్ తో, తెలుగులో ఆవాహం గా ఒకే రోజు రిలీజ్ చేస్తున్నారు. అత్యధిక ప్రింట్లతో ఈ చిత్రం విడుదల చేయాలని వర్మ భావిస్తున్నారు.