Don't Miss!
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మాస్ హీరో విశాల్ వచ్చేస్తున్నాడు.. రిలీజ్కు 'అభిమన్యుడు' సిద్ధం
మాస్ హీరో విశాల్ కథానాయకుడిగా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో తమిళ్లో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ 'ఇరుంబుతెరై'. ఇటీవల తమిళనాడులో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని 'అభిమన్యుడు' పేరుతో ఎం.పురుషోత్తమన్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి తెలుగులో విడుదల చేస్తున్నారు.
సమంత హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్ర పోషించారు. ఇటీవల తమిళ్లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. మే చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హరి వెంకటేశ్వర పిక్చర్స్ అధినేత జి.హరి మాట్లాడుతూ ''అభిమన్యుడు' చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యు/ఎ సర్టిఫికెట్ పొందింది.
తమిళ్లో ఇటీవల విడుదలైన ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. విశాల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా ఈ చిత్రం నిలిచింది. రివ్యూస్ కూడా చాలా ఎక్స్ట్రార్డినరీగా వచ్చాయి. 'రంగస్థలం', 'మహానటి' వంటి సూపర్హిట్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ సమంతకు 'ఇరుంబుతెరై' హ్యాట్రిక్ చిత్రంగా నిలిచింది. తమిళ్లో అద్భుత విజయాన్ని అందుకున్న ఈ చిత్రం తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది'' అన్నారు.