Don't Miss!
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Finance Cerelac News: పేదదేశాల సెరెలాక్ ఉత్పత్తులో పంచదార..!! FSSAIకి నోటీసులు జారీ..
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రానా తమ్ముడు హీరోగా "జతొజడ మీద జమజచ్చ" కి సీక్వెల్
డైరెక్టర్ వంశీని మరోమెట్టుకు తీసుకెళ్లిన చిత్రం లేడీస్ టైలర్. రాజేంద్రప్రసాద్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలచిన ఈ మూవీ.. ఆ ఏడాది హిట్ సినిమాల్లో ఒకటిగా నిలచింది. రాజేంద్రుడికి కామెడీ హీరోగా స్టార్ ఇమేజ్ ను కట్టబెట్టింది. ఇక ఈ సినిమా అంతా మచ్చ ఉన్న అమ్మాయి కోసం వెతికే టైలర్ గా రాజేంద్రప్రసాద్ చేసిన చిలిపి చేష్టలు ఇప్పటికీ గిలిగింతలు పెట్టిస్తాయి. 1985లో సందడి చేసిన ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు వంశీ.
అయితే తండ్రి మచ్చకోసం వెతికినట్లు.. కొడుకు దేనికోసం వెతక బోతున్నాడన్నదే ఇప్పుడు ఫిలింనగర్ లో హాట్ టాపిక్.... మచ్చ కనుక్కునే ప్రయత్నంలో అమ్మాయిలకు స్పెషల్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాడు లేడీస్ టైలర్. ఇప్పటి కాలంలో అది వర్కౌట్ కాదు... ఎందుకంటే ఇప్పుడున్న హీరోయిన్లతో పాటు జనాలు కూడా మినీ స్కర్ట్ లు, స్లీవ్ లెస్ లు వేసుకుంటారు..
మొదట్లో రాజ్ తరుణ్ హీరో అనుకున్నారు కానీ తెరవెనుక ఏమైందో మరి రాజ్ తరుణ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించబడ్డాడు. తనే తప్పుకున్నాడు అని కూడా అన్నారు. రాజ్ కంటే ముందు కొన్నాళ్ళు రవితేజ పేరుకూడా వినిపించింది. కానీ సినిమా మళ్ళీ మళ్ళీ వాయిదా పడుతూనే వస్తోంది. సరైన నిర్మాత దొరకక ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఫైనల్ గా ఈ సినిమా రీమేక్ త్వరలోనే సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఇటీవలే నిహారికతో 'ఒక మనసు' చిత్రాన్ని నిర్మించిన మధుర శ్రీధర్ నిర్మిస్తున్నారు. ఇంకా ఆసక్తి కరమైన సంగతేంటంటే.. ఈ సినిమాలో హీరోగా దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ నటించనున్నాడు.
వచ్చే నెల నుండి సెట్స్ మీదికెళ్ళనన్న ఈ సినిమాకి 'ఫ్యాషన్ డిజైనర్ S/O లేడీస్ టైలర్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మధుర శ్రీధర్ నిర్మించనున్న ఈ సినిమాలో మరో ఇద్దరు కథానాయకులకి ప్రాధాన్యం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల నటుడు, దర్శకుడు అయిన శ్రీనివాస్ అవసరాల కుట్టు మిషన్తో ఉన్న ఓ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ 'జటై.. జైలర్' అని రాసుకొచ్చాడు. ఈ వ్యవహారం చూస్తోంటే అతడూ ఈ సినిమాలో భాగం కానున్నట్టు అవగతమవుతోంది.