Don't Miss!
- News జగన్కు షాక్..పిఠాపురంలో వైసీపీకి భారీగా రాజీనామాలు
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బోయపాటి, నిఖిల్,సుధీర్ బాబు...వీళ్లందరితో ఒకే నిర్మాత 5 సినిమాలు ప్రకటన
హైదరాబాద్: పంపిణీ రంగంలో నెంబర్ వన్ స్దానంలో వెలుగుతున్నారు అభిషేక్ పిక్చర్స్. వరసపెట్టి పెద్ద సినిమాలు...'శ్రీమంతుడు','రుద్రమదేవి', 'నాన్నకు ప్రేమతో', 'సుప్రీమ్', 'కబాలి' వంటి సహా అనేక భారీ చిత్రాలను పంపిణీ చేసిన ఈ సంస్ద ఇప్పుడు నిర్మాణ రంగంలోకి వస్తోంది.
చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించడమే లక్ష్యంగా కలిగిన ఆ సంస్థ అధినేత అభిషేక్ నామా ఇప్పుడు నిర్మాణరంగంలోకి కూడా అడుగుపెడుతున్నామని చెప్తున్నారు. ఐదు సినిమాలను నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆ ఐదు చిత్రాల వివరాలు..
ఇక ఈ సినిమాలు కూడా తాము రిలీజ్ చేసి, సక్సెస్ సాధించిన చిత్రాలు లాగే మంచి కథ,కథనంతో రెడీ అవుతున్నాయని చెప్తున్నారు. ఈ సినిమాల్లో హై బడ్జెట్, మీడియా, లో బడ్జెట్ అన్నీ ఉండటం విశేషం. సినిమా పరిశ్రమతో తమకున్న అనుబంధంతో ఈ సినిమా ప్రారంభిస్తున్నట్లు చెప్తున్నారు.
ఆ సినిమాల డిటేల్స్...
బోయపాటి శ్రీను డైరక్షన్...
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఓ యాక్షన ఎంటర్టైనర్ను నిర్మించనున్నారు అభిషేక్. ఇందులో రకుల్ ప్రీతసింగ్ హీరోయిన్. దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. ‘సరైనోడు' చిత్రానికి ఛాయాగ్రాహకునిగా పనిచేసిన రిషీ పంజాబీ ఈ చిత్రానికి పనిచేయనున్నారు. సెప్టెంబర్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది.
నిఖిల్ తో ..
సెప్టెంబర్లోనే
మరో
సినిమా
కూడా
ప్రారంభించనున్నారు
అభిషేక్.
‘స్వామి
రారా'
చిత్రంతో
హిట్
కాంబినేషన
అనిపించుకొన్న
హీరో
నిఖిల్,
దర్శకుడు
సుధీర్
వర్మ
కలయికలో
ఈ
సినిమా
రూపుదిద్దుకొంటుంది.
‘క్షణం' కాంబినేషన్ లో ...
‘క్షణం' జంట అడవి శేష్, అదా శర్మ కాంబినేషనలో ‘క్షణం' దర్శకుడు రవికాంత పేరేపు దర్శకత్వంలో నిర్మించే చిత్రం షూటింగ్ ఆగస్టు నెలాఖరున ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి ‘గూఢచారి' అనే టైటిల్ను ఖరారు చేశారు.
బయోపిక్
ప్రముఖ బ్యాడ్మింటన క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా నిర్మించే చిత్రంలో సుధీర్బాబు హీరోగా నటించనున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపుదిద్దుకొనే ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన వర్క్ పూర్తయింది.
హంటర్ రీమేక్
ఫాంటమ్- రిలయన్స సంస్థలతో కలసి అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. హిందీలో రూపుదిద్దుకొన్న ‘హంటర్' చిత్రానికి రీమేక్ ఇది. ప్రముఖ వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్, ‘లండన డ్రీమ్స్' దర్శకుడు నవీన మేడారం దర్శకుడు, శ్రీనివాస్ అవసరాల హీరో.
మామూలు విషయంకాదు...
ఇలా ఒకేసారి ఐదు చిత్రాలు ప్లాన్ చేయడమంటే అది మామూలు విషయమే కాదు.. దీనిపై వివరణ ఇస్తూ ‘ఈ ఐదు చిత్రాల నిర్మాణం అనుకొన్న విధంగా సాగేట్లు పకడ్బందీగా ప్లాన చేశాం' అని అభిషేక్ నామా చెప్పారు. ఈ ఐదు చిత్రాలకూ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా కాలి సుధీర్ వ్యవహరిస్తారు.