Don't Miss!
- News దేశ రాజకీయాల్లో ఆ ఘనత సాధించిన ఒకేఒక్కడు పవన్ కళ్యాణ్
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
'సింహా'కి బడ్జెట్ వేసుకోకుండానే తీశాం
'సింహా'కి బడ్జెట్ వేసుకోకుండానే తీశాం. ఇప్పుడు 'నా ఇష్టం'కు కూడా మేం బడ్జెట్ వేసుకోలేదు. ప్రస్తుతం వెంకటేశ్తో చేస్తున్న 'షాడో'కీ అంతే. హీరోకి 'ఇంత మార్కెట్ ఉంది' అని కచ్చితంగా చెప్పలేం. ఓ పెద్ద హీరో సినిమా ఒకటి నలభై, ఏభై కోట్లు వసూలు చేస్తే, ఆ తర్వాత సినిమా ఇరవై కోట్లే వసూలు చేస్తుంది. నేను 'హీరో మార్కెట్' అనేదాన్ని నమ్మను. స్క్రిప్టుని నమ్మితే, దానికి ఎంత అవసరమో అంతా పెట్టాలనుకుంటా అన్నారు నిర్మాత పరుచూరి ప్రసాద్.
ఆయన తాజా నా ఇష్టం చిత్రం విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే...స్క్రిప్టుని బట్టే బడ్జెట్ ఇదివరకటి సినిమాలకంటే ఈ సినిమాకి మేం పడ్డ కష్టం ఎక్కువ. ఈ సినిమా ప్రిపరేషన్ నుంచి పూర్తయ్యేదాకా 22 నెలల సమయం పట్టింది. దర్శకుడు కొత్తవాడైనా ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టకుండా కావలసినంత స్వేచ్ఛ ఇచ్చాం. సమ్మెలు రావడం వల్ల షెడ్యూళ్లకు ఆటంకాలు ఎదురయ్యాయి. అయినా 103 పని దినాల్లో సినిమాని పూర్తి చేయగలిగాం అన్నారు.