twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దాసరి పద్మ ఆరోగ్యం క్రిటికల్ గా...

    By Srikanya
    |

    ప్రముఖ దర్సకుడు దాసరి నారాయణరావు భార్య దాసరి పద్మ ఆరోగ్య పరిస్ధితి చాలా క్రిటికల్ గా ఉందని సమాచారం. హైదరాబాద్ లోని యశోద హాస్పటిల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటోందని తెలుస్తోంది. నటి జయసుధ ఆమెను హాస్పటిల్ కి వెళ్లి చూసి వచ్చారు. ఆమె చాలా కాలంగా అనారోగ్యంగాతో బాధపడుతున్నారని, పరిస్దితి బాగోకే ఆమెను హాస్పటిల్ లో చేర్చారని చెప్తున్నారు. దాసరి పద్మ.. శివరంజని, మేఘసంగేశం, మజ్ను, ఒసేయ్ రాములమ్మ, కొండవీటి సింహాసనం, ఒరేయ్ రిక్షా వంటి పది చిత్రాల దాకా నిర్మించారు. ఇక దాసరి సంక్రాంతికి విడుదల చేసిన పరమవీరచక్ర చిత్రం తర్వాత మరే చిత్రం డైరక్ట్ చేయలేదు.

    అయితే ఆయన 'రామసక్కనితల్లి', 'కౌన్ బనేగా ముఖ్యమంత్రి' అనే టైటిల్స్ తో సినిమాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు ప్రాజెక్ట్స్ కు సంబంధించి ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోందని చెప్తున్నారు. అంతేగాక త్వరలో కౌశిక్ బాబుని హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తానని స్వయంగా దాసరి చెప్పారు. ప్రజెంట్ ట్రెండ్ కి అనుగుణంగా వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. కౌసిస్.. పలు సీరియల్స్ లో బాల నటుడిగా ప్రతిభ ప్రదర్శించి, పలు అవార్డులు కూడా అందుకున్నారు. ఇక దాసరి పద్మ త్వరగా కోలుకోవాలని ధట్స్ తెలుగు కోరుకుంటోంది.

    English summary
    Wife of famous director Dasari Narayana Rao, Dasari Padma has been suffering from prolomged illness. She is currently undergoing treatment in Yashoda hospital in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X