Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
దాసరి పద్మ ఆరోగ్యం క్రిటికల్ గా...
ప్రముఖ దర్సకుడు దాసరి నారాయణరావు భార్య దాసరి పద్మ ఆరోగ్య పరిస్ధితి చాలా క్రిటికల్ గా ఉందని సమాచారం. హైదరాబాద్ లోని యశోద హాస్పటిల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటోందని తెలుస్తోంది. నటి జయసుధ ఆమెను హాస్పటిల్ కి వెళ్లి చూసి వచ్చారు. ఆమె చాలా కాలంగా అనారోగ్యంగాతో బాధపడుతున్నారని, పరిస్దితి బాగోకే ఆమెను హాస్పటిల్ లో చేర్చారని చెప్తున్నారు. దాసరి పద్మ.. శివరంజని, మేఘసంగేశం, మజ్ను, ఒసేయ్ రాములమ్మ, కొండవీటి సింహాసనం, ఒరేయ్ రిక్షా వంటి పది చిత్రాల దాకా నిర్మించారు. ఇక దాసరి సంక్రాంతికి విడుదల చేసిన పరమవీరచక్ర చిత్రం తర్వాత మరే చిత్రం డైరక్ట్ చేయలేదు.
అయితే ఆయన 'రామసక్కనితల్లి', 'కౌన్ బనేగా ముఖ్యమంత్రి' అనే టైటిల్స్ తో సినిమాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు ప్రాజెక్ట్స్ కు సంబంధించి ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోందని చెప్తున్నారు. అంతేగాక త్వరలో కౌశిక్ బాబుని హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తానని స్వయంగా దాసరి చెప్పారు. ప్రజెంట్ ట్రెండ్ కి అనుగుణంగా వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. కౌసిస్.. పలు సీరియల్స్ లో బాల నటుడిగా ప్రతిభ ప్రదర్శించి, పలు అవార్డులు కూడా అందుకున్నారు. ఇక దాసరి పద్మ త్వరగా కోలుకోవాలని ధట్స్ తెలుగు కోరుకుంటోంది.