Don't Miss!
- News Atchannaidu: అచ్చెన్నాయుడికి ఎన్నికల వేళ హైకోర్టులో భారీ ఊరట..!
- Finance Ambani-Adani: చేతులు కలిపిన అంబానీ-అదానీ.. 20 ఏళ్లకు అగ్రిమెంట్.. ఆ స్టాక్ దూకుడు..
- Automobiles హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
ఐడియా బావుంది..వర్కవుట్ అవుద్దా
హైదరాబాద్ : ''మనకు సాధారణంగా సినిమా అంటే రెండు గంటలు. మహా అయితే రెండున్నర గంటలు అలవాటు. ఇప్పుడు నేను ఆ సమయంలోనే రెండు సినిమాలు చూపించబోతున్నాను. 80 నిమిషాల నిడివితో రెండు వేర్వేరు సినిమాలు తెరకెక్కించి ఆ రెండింటిని జోడించి ఒకే టికెట్పై రెండు సినిమాలు చూపిస్తాం. వీటికి'ముసలోడు', 'ది లేటెస్ట్' అని పేర్లు పెడుతున్నాను అంటున్నారు లారెన్స్. ఈ ఐడియా విన్న ఇండస్ట్రీ జనం..గతంలో తెలుగులో చేసారని, అయితే అప్పట్లో వర్కవుట్ కాలేదని, ఇప్పుడు కాలం మారింది కాబట్టి కమర్షియల్ గా వర్కవుట్ అయ్యే అవకాసం ఉందని అంటున్నారు.
సినిమాకెళ్లినప్పుడు విశ్రాంతి సమయంలో 'శుభం' కార్డు పడి, టీ తాగొచ్చాక వేరే సినిమా ఓపెనింగ్ టైటిల్స్ పడితే- కొత్తగా ఉంది కదా ఈ ఆలోచన. ఇలాంటి ఆలోచనే చేశారు లారెన్స్. ఆయన తాజా చిత్రం 'ముని 3: గంగ' తర్వాత ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని ఆయన గురువారం హైదరాబాద్లో తెలిపారు.
లారెన్స్ కంటిన్యూ చేస్తూ... ఈ రెండింటిలోనూ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నాను. రెండు పాత్రలు, కథలు, సినిమాలు ఒకదానికొకటి అస్సలు సంబంధం ఉండవు. 'ముసలోడు'లో ఆండ్రియా, 'ది లేటెస్ట్'లో లక్ష్మీరాయ్ హీరోయిన్ గా చేస్తారు. పూర్వ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబరులో చిత్రాన్ని పట్టాలెక్కిస్తాను. 'ముసలోడు'లో వినోదం, సందేశం, యాక్షన్ అంశాలుంటాయి. 'దిలేటెస్ట్' పూర్తి వినోదాత్మక వాణిజ్య చిత్రంగా ఉంటుంది''అన్నారు. లక్ష్మీరాయ్ మాట్లాడుతూ ''నా సినీ జీవితంలో సరికొత్త పాత్ర పోషిస్తున్నాను. నా పాత్ర చిత్రణ, శైలి కొత్తగా ఉంటాయి'' అని చెప్పింది.
'గంగ' గురించి చెప్తూ... 'ముని' పరంపరలో భాగంగా తెరకెక్కుతున్న మూడో చిత్రం 'ముని 3: గంగ'. లారెన్స్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. తాప్సి, నిత్యమీనన్ ముఖ్యపాత్రధారులు. బెల్లంకొండ సురేష్ నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ చివరిదశకొచ్చింది. ''కాంచన' విజయవంతమైన సమయంలో 'గంగ' ప్రారంభించాను. మధ్యలో అనారోగ్యం పాలవడం వల్ల ఐదు నెలలపాటు చిత్రీకరణకు విరామమిచ్చాను. ఇటీవల మళ్లీ చిత్రీకరణ ప్రారంభించాం. త్వరలో పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తామ''న్నారు లారెన్స్.