Don't Miss!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- News సీఎం జగన్ కొత్త ఎన్నికల నినాదం..డబుల్ సెంచరీ ప్రభుత్వం అంటూ
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'దూకుడు' లో ఆటో సుబ్బారావు అల్లరి
'ఓ వైపు హాయ్ అంటాడు ఆటో సుబ్బారావు..' అంటూ మహేష్ బాబుతో కలసి రెచ్చి పోతోంది పార్వతీ మిల్టన్.మహేష్ 'దూకుడు'లో ఆమెపై ఈ గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈపాటతో షూటింగ్ పూర్తవుతుంది. ఈనెల 23న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ''యాక్షన్ అంశాలతో పాటు వినోదం కలగలిపిన చిత్రమిది. 'మైండ్లో ఫిక్సయితే బ్త్లెండ్గా దూసుకుపోతా..' 'భయానికి మీనింగు తెలియని బ్లడ్రా నాది..' ఇలా మహేష్ పలికే సంభాషణలు అందరినీ ఆకట్టుకొంటాయి. మహేష్ అభిమానులకు ఈ సినిమా ఓ విందు భోజనం లాంటిది. సమంత పాత్ర కేవలం గ్లామర్కే పరిమితం కాలేదు. తమన్ బాణీలకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం చిత్రీకరిస్తున్న పోయ్..పోయ్ పాట మాస్కి బాగా నచ్చుతుంది అన్నారు. మహేష్బాబు హీరోగా నటిస్తున్న చిత్రం 'దూకుడు'. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. ప్రస్తుతం రామోజీఫిల్మ్సిటీలో ఈ ఐటం సాంగ్ షూటింగ్ జరుగుతోంది.
అయితే ఈ పాట బాగా మితిమీరి చిత్రీకరిస్తున్నారని, పార్వతి గ్లామర్ మోతాదు మించి ఒలక పోస్తోందని చెప్పుకుంటున్నారు. ఈ విషయమై మీడియా వారు పార్వతి మిల్టన్ ని సంప్రదిస్తే ఆమె మాట్లాడుతూ...పాట సిట్యేషన్ని బట్టి కాస్త గ్లామర్గానే కనిపించాలి. గ్లామర్ ఫీల్డ్లో ఉన్నప్పుడు గ్లామర్గా కనిపించకపోతే ఎలా?. అంతగా మోతాదు మించితే... ఎడిట్ చేయడానికి సెన్సార్ ఉందిగా అంది. అలాగే బాలీవుడ్లో పెద్ద పెద్ద స్టార్హీరోయిన్లే ఐటమ్ నంబర్స్ చేస్తున్నారు. నేను చేస్తే అదేదో పెద్ద నేరంలా భావిస్తున్నారేంటి?. మహేష్ నా ఫేవరెట్ స్టార్. తనతో హీరోయిన్గానే చేయాల్సింది. కానీ కుదర్లేదు. అందుకే తనతో సాంగ్ అనగానే ఓకే అనేశాను అని చెప్పుకొచ్చింది. ఐటమ్ నంబర్లో డాన్స్ చేస్తున్నందకు తానేం బాధ పడటం లేదని, ఒక్కపాటలో నర్తించినా, ఆ పాట ద్వారా తన గ్లామర్ సత్తా ఏంటో నిరూపిస్తానని పార్వతి చెప్పింది. ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ, కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు.