Acharya మళ్లీ మారిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక.. విజయవాడ కాదు.. ఎక్కడంటే?

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తొలుత ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుగుతుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత అనూహ్యంగా విజయవాడలో ఒక ప్రముఖ కళాశాలలో జరుగుతుంది అంటూ ప్రచారం మొదలైంది. తాజాగా ఈ ప్రీ రిలీజ్ వేడుక మరోసారి మారినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

షూటింగ్ పూర్తయి

షూటింగ్ పూర్తయి

సైరా నరసింహారెడ్డి విడుదల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్య అనే సినిమా చేశారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కాజల్, పూజ హెగ్డే హీరోయిన్స గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. అయితే కరోన సహా అనేక కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది.

అద్భుతమైన స్పందన

అద్భుతమైన స్పందన

ఫిబ్రవరి నాలుగో తేదీన విడుదల చేయాలని అనుకున్నారు కానీ మళ్లీ వాయిదా వేసి మార్చి 29 వ తేదీన విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. మార్చి 29 వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలని భావిస్తున్న సినిమా యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ కూడా ప్రారంభించింది. మార్చి 12వ తేదీన ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయగా దానికి అద్భుతమైన స్పందన కూడా లభించింది.

విజయవాడ సిద్ధార్థ కళాశాల గ్రౌండ్ లో

విజయవాడ సిద్ధార్థ కళాశాల గ్రౌండ్ లో

అయితే తొలుత ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని యూసఫ్ గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరగవచ్చని అంచనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు గానీ విజయవాడ సిద్ధార్థ కళాశాల గ్రౌండ్ లో ఈ వేడుక జరగబోతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన నిరంజన్ రెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు కావడంతో అది జరిగే అవకాశాలు లేకపోలేదు అని భావించారు.

పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో

పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో

అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాదులోనే జరగబోతోంది. ఈ నెల 23వ తేదీన హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు నిర్మాతలు ప్లాన్ చేశారు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుకకు కూడా ఘనంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ వేడుక జరుగబోతోంది.

పవన్ కళ్యాణ్ హాజరవుతున్నట్లు

పవన్ కళ్యాణ్ హాజరవుతున్నట్లు

ఈ వేడుకకు జనసేనాని పవన్ కళ్యాణ్ హాజరవుతున్నట్లు తాజా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన లేదు కానీ రాజమౌళి త్రివిక్రమ్ శ్రీనివాస్ సహా పలువురు మెగా కుటుంబానికి సంబంధించిన హీరోలు హాజరవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. శ్రీమతి కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ల మీద నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సోనూసూద్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X