Don't Miss!
- Finance Stock Market: యూఎస్ మార్కెట్ల దారిలో ఇండియన్ మార్కెట్లు.. లాభాల్లోనే ప్రయాణం..
- News చంద్రబాబు పై చర్యలకు ఈసీకి సీఈవో సిఫార్సు..!!
- Sports Sachin Tendulkar: కన్నీటిని ఆపుకుంటూ సెంచరీ!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సెన్సార్బోర్డ్ను మూసేయడం మంచిది : హీరో అర్జున్
ఐటీసీ కాకతీయ హోటల్లో నిర్వహించిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్జున్ వివిధ అంశాలపై మాట్లాడారు. 'ఒకరిద్దరు నిర్మాతలు వందలాది థియేటర్లును లీజుకు తీసుకుని పూర్తిగా తమ అధీనంలో పెట్టుకోవడం అంత క్షేమకరమైన విధానం కాదు. ఏ నిర్ణయమైనా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. అయితే ప్రస్తుత రోజుల్లో సినిమా తీసిన నిర్మాత తన పెట్టుబడి ఫలితాన్ని వీలైనంత త్వరగా పొందాలని ఆశించడం కూడా పొరపాటేమీ కాదు' అన్నారు.
'హైదరాబాద్లో బాంబు పేలుళ్లు బాధను కలిగించాయి. ఇలాంటి సమయంలోనే నాయకులు ఏం చేస్తున్నారా అనే సందేహం కలుగుతుంది. మనం ఓట్లేసి గెలిపించిన వారు బాధ్యతగా వ్యవహరిస్తే ఇలాంటివి పునరావృతం కావు' అన్నారు హీరో అర్జున్. మన సినిమాల స్థాయి హాలీవుడ్ కంటే కనీసం 25 ఏళ్లు వెనుకబడి ఉందన్నారు.
తన తాజా ప్రాజెక్టుల గురించి చెప్తూ....త్వరలోనే తెలుగులో కోడిరామకృష్ణ దర్శకత్వంలో పల్లెటూరి నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నానని... 'సీఎం' పేరుతో స్వీయ దర్శకత్వం లో తీస్తున్న ద్విభాషా చిత్రంలో నటిస్తున్నానని తెలిపారు. సినిమాలు సమాజంలో సమస్యల్ని మాత్రమే కాదు... పరిష్కారాలను కూడా చూపాలని, ఆ కోవలోనే 'సీఎం' సినిమా రూపొందుతోందన్నారు. సీఎం సినిమాను డీటీహెచ్లో విడుదల చేస్తారా అన్న ప్రశ్నకు ఇప్పుడే చెబితే ఎలా అని నవ్వుతూ అన్నారు.