Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రవితేజ...పవర్ పెంచటానికే రెండు కోట్లు ఖర్చు
హైదరాబాద్ :రవితేజ హీరోగా రాక్ లైన్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవీంద్రనాధ్ దర్శకత్వంలో రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'పవర్'. ఈ చిత్రం మరింత ఎఫెక్టివ్ గా ఉండేందుకు యాక్షన్ సీక్వెన్స్ లకు భారీ గా అంటే రెండు కోట్లు వరకూ ఖర్చు పెడుతున్నామని దర్శకుడు రవీంద్రనాధ్ చెప్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ లను బ్యాంకాక్ లో ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ మే 3 నుంచి 10 వరకు బ్యాంకాక్ లో జరుగుతుంది. ఇన్నాళ్లూ కేవలం కామెడీపైనే కాన్సర్టేట్ చేసిన రవితేజ ఇప్పుడు యాక్షన్ పైనా దృష్టి పెట్టారు.
దర్శకుడు మాట్లాడుతూ.... మే 3 నుండి పది వరకు బ్యాంకాక్ లో మాస్ రవితేజ, సుబ్బరాజు, బ్రహ్మాజీ, అజయ్, సంపత్ రాజ్ లతో పాటు కొంతమంది ఫైటర్స్ పాల్గొనే భారీ ఛేజ్ ను రెండు కోట్ల రూపాయల వ్యయంతో ధూమ్, థూమ్ 2 రేస్,రంగ్ దే బసంతి,సింగ్ ఈజ్ కింగ్ వంటి చిత్రాలకు ఫైట్స్ కంపోజ్ చేసిన అలెన్ అమిన్ ఆధ్వర్యంలో తీస్తున్నాము. మా నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందిస్తున్నారు అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ.. ''హైదరాబాద్ కోల్ కత్తా, చెన్నయ్ లలో షెడ్యూళ్ళు చేశాము. బ్యాంకాక్ షెడ్యూల్ తరువాత 11 నుంచి హైదరాబాద్ లో షెడ్యూల్ కంటిన్యూ గా చేస్తాము. రెండు పాటలు విదేశాల్లో తీయడం తో సినిమా పూర్తవుతుంది. బలుపు'తో మాస్ హీరోల్లో తనకు తిరుగులేదని రవితేజ మరోసారి రుజువు చేశారు. దాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకులకు పూర్తిస్థాయి వినోదాన్నిచ్చేందుకు ఈ చిత్రం వస్తోంది. మాస్ తరహా పోలీసుగా రవితేజ ఆకట్టుకుంటాడు''అని అన్నారు.
మాస్ అంటే బస్పాస్ కాదు... ఎవడుపడితే వాడు వాడేసుకోవడానికి. అది మన బలుపు, బాడీలాంగ్వేజ్ బట్టి జనం పిలుచుకునే పిలుపు వంటి మాస్ డైలాగులతో ఈ చిత్రం రవితేజ కెరీర్ లో లాండ్ మార్క్ గా మిగులుతుందని అంటున్నారు. ''అటు ప్రేక్షకుల్నీ, ఇటు నిర్మాతల్నీ సంతోషపెట్టే కథలే ఎంచుకొంటాను. ముందు నుంచీ నా ప్రయాణం ఇలానే సాగింది. ఇక ముందు కూడా ఇంతే. డబ్బులు రాని ప్రయోగాలు చేయడం నాకు ఇష్టం ఉండదు'' అని చెప్తున్నారు రవితేజ. బాబి చెప్పిన కథ బాగా నచ్చిందని, సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని రవితేజ తెలిపారు.
రాక్లైన్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి) దర్శకత్వంలో రాక్లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హన్సిక తొలిసారిగా రవితేజ సరసన హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, ముఖేష్ రుషి, రావూ రమేష్, సంపత్, సుబ్బరాజు, సప్తగిరి, సురేఖావాణి, జోగి బ్రదర్స్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:ఎస్.ఎస్.తమన్, కెమెరా:ఆర్థర్ ఎ.విల్సన్, ఎడిటింగ్:గౌతమ్రాజు, మాటలు:కోన వెంకట్, నిర్మాత:రాక్లైన్ వెంకటేష్, కథ, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్రనాధ్ (బాబి).