Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
కళాతపస్వికి అల్లు అర్జున్, మంత్రి తలసాని అభినందనలు..
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన ప్రముఖ దర్శకుడు కే విశ్వనాథ్ను పలువురు సినీ ప్రముఖులు బుధవారం కలిశారు. విశ్వనాథ్ను కలిసిన వారిలో రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీ నటుడు అల్లు అర్జున్
భారతీయ సినిమా పరిశ్రమలో నోబెల్ పురస్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన ప్రముఖ దర్శకుడు కే విశ్వనాథ్ను పలువురు సినీ ప్రముఖులు బుధవారం కలిశారు. విశ్వనాథ్ను కలిసిన వారిలో రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీ నటుడు అల్లు అర్జున్ ఉన్నారు. గత రెండు రోజుల క్రితం విశ్వనాథ్కు కేంద్ర ప్రభుత్వం ఫాల్కే అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆత్మీయ పలకరింపు
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని అల్లు అర్జున్ బుధవారం విశ్వనాథ్ను ఆత్మీయంగా పలుకరించారు. కళాతపస్వి నివాసానికి వెళ్లి అల్లు అర్జున్ కాసేపు గడిపారు. ఫాల్కే అవార్డు వచ్చినందుకు అభినందలు తెలిపారు. ఆయన యోగక్షేమాలను తెలుసుకొని కుటుంబ సభ్యులను పలకరించారు.
కళాతపస్విని కలిసిన మంత్రి తలసాని
ప్రతిష్టాత్మక ఫాల్కే అవార్డుకు ఎంపికైన కే విశ్వనాథ్ను మంత్రి తలసాని అభినందించారు. దర్శక దిగ్గజం నివాసానికి వెళ్లి శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున అభినందనలు తెలిపారు.
మెగాస్టార్, పవర్స్టార్ అభినందన
ఫాల్కే అవార్డు వచ్చిన నేపథ్యంలో విశ్వనాథ్ను మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలుసుకొన్నారు. విశ్వనాథ్కు అవార్డు రావడం ఫాల్కే పురస్కారానికి నిండుతనం వచ్చిందని మెగాస్టార్ అన్న విషయం తెలిసిందే.
మే 3న పురస్కార ప్రదానం
దర్శక దిగ్గజం విశ్వనాథ్కు కేంద్ర ప్రభుత్వం మే 3 తేదీన అవార్డును అందజేయనున్నారు. అవార్డు కింద 10 లక్షల నగదు, స్వర్ణ పతకం, శాలువాతో సత్కరించారు.