Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కళాతపస్వికి అల్లు అర్జున్, మంత్రి తలసాని అభినందనలు..
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన ప్రముఖ దర్శకుడు కే విశ్వనాథ్ను పలువురు సినీ ప్రముఖులు బుధవారం కలిశారు. విశ్వనాథ్ను కలిసిన వారిలో రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీ నటుడు అల్లు అర్జున్
భారతీయ సినిమా పరిశ్రమలో నోబెల్ పురస్కారంగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన ప్రముఖ దర్శకుడు కే విశ్వనాథ్ను పలువురు సినీ ప్రముఖులు బుధవారం కలిశారు. విశ్వనాథ్ను కలిసిన వారిలో రాష్ట్రమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీ నటుడు అల్లు అర్జున్ ఉన్నారు. గత రెండు రోజుల క్రితం విశ్వనాథ్కు కేంద్ర ప్రభుత్వం ఫాల్కే అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆత్మీయ పలకరింపు
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని అల్లు అర్జున్ బుధవారం విశ్వనాథ్ను ఆత్మీయంగా పలుకరించారు. కళాతపస్వి నివాసానికి వెళ్లి అల్లు అర్జున్ కాసేపు గడిపారు. ఫాల్కే అవార్డు వచ్చినందుకు అభినందలు తెలిపారు. ఆయన యోగక్షేమాలను తెలుసుకొని కుటుంబ సభ్యులను పలకరించారు.
కళాతపస్విని కలిసిన మంత్రి తలసాని
ప్రతిష్టాత్మక ఫాల్కే అవార్డుకు ఎంపికైన కే విశ్వనాథ్ను మంత్రి తలసాని అభినందించారు. దర్శక దిగ్గజం నివాసానికి వెళ్లి శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున అభినందనలు తెలిపారు.
మెగాస్టార్, పవర్స్టార్ అభినందన
ఫాల్కే అవార్డు వచ్చిన నేపథ్యంలో విశ్వనాథ్ను మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలుసుకొన్నారు. విశ్వనాథ్కు అవార్డు రావడం ఫాల్కే పురస్కారానికి నిండుతనం వచ్చిందని మెగాస్టార్ అన్న విషయం తెలిసిందే.
మే 3న పురస్కార ప్రదానం
దర్శక దిగ్గజం విశ్వనాథ్కు కేంద్ర ప్రభుత్వం మే 3 తేదీన అవార్డును అందజేయనున్నారు. అవార్డు కింద 10 లక్షల నగదు, స్వర్ణ పతకం, శాలువాతో సత్కరించారు.