Don't Miss!
- News ఆపరేషన్ పిఠాపురం ! పవన్ ను ఓటమికి జగన్ బిగ్ ప్లాన్ ఇదే..!
- Sports Shreyanka Patil: ఆటతోనే కాదు..అందంతోనూ క్లీన్ బౌల్డే!
- Technology వన్ప్లస్ 12R స్పెషన్ ఎడిషన్ స్మార్ట్ఫోన్ సేల్ ప్రారంభం.. బ్యాంకు ఆఫర్ల ద్వారా ధర తగ్గింపు..!
- Finance Layoff News: యూనీలివర్ 7,500 ఉద్యోగుల కోత.. పూర్తి వివరాలివే..
- Lifestyle Chapathi Kurma: చిటికెలో రుచికరంగా చపాతీ కుర్మా రిసిపి రెడీ.
- Travel ఐఆర్సీటీసీ VIZAG - ARAKU HOLIDAY PACKAGE మార్చి 22 నుంచే..
- Automobiles వయసు కేవలం నెంబర్ మాత్రమే!.. ఎందుకో వీడియో చూస్తే తెలుస్తుంది
రజనీ, కమల్ పై నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు.. వారికంటే శింబు చాలా బెటర్!
సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వ నటుడు కమల్ హాసన్ గురించి కన్నడ సీనియర్ నటుడు అనంత నాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.రజని కాంత్, కమల్ హాసన్ రాజకీయాల్లోకి వస్తున్న తరుణంలో తాను చాలా ఊహించుకున్నానని అనంత నాగ్ తెలిపారు. కావేరి నది జలాల విషయంలో కమల్ హాసన్, రజనీకాంత్ కర్ణాటక ప్రభుత్వం పై మండి పడిన సంగతి తెలిసిందే. రజని, కమల్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తరుణంలో వారినుంచి తాను చాలా ఆశించానని అనంత నాగ్ అన్నారు.
కానీ వారిద్దరూ పాత ధోరణిలోనే రాజకీయాలు చేస్తున్నట్లు అనిపిస్తోందని చురకలు అంటించారు. కర్ణాటకలో ఎన్నికల సమయం నడుస్తోంది. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొని ఉంది. తమిళనాడులో ఇప్పట్లో ఎన్నికలు జరగవు. అయినా కూడా ఎందుకు ఉద్రేకానికి గురవుతున్నారని అనంత నాగ్ ప్రశ్నించారు. రజని, కమల్ కన్నా నటుడు శింబు పరిణితో వ్యవహరించి మాట్లాడాడని అన్నారు. ఎలాంటి పోరాటం లేకుండా కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు కావేరి నీళ్లు ఇవ్వాలని శింబు వినమ్రంగా విజ్ఞప్తి చేసారు.
ఇలాటి పరిస్థితుల్లో అలాంటి ధోరణి అవసరం అని అనంత నాగ్ అన్నారు. శింబు ప్రదర్శించిన పరిణితి రజని, కమల్ చూపక పోవడం తనని విస్మయానికి గురిచేసిందని అనంత నాగ్ అన్నారు. ఆఫ్రికాలోని నైలు నది సమస్య పరిష్కారం అయింది. అలాంటి పరిష్కారం ఇక్కడ కూడా అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు.