Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాతకు మాతృవియోగం
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి గడ్డుకాలం నడస్తోన్నట్టు కనిపిస్తోంది. సినీ ప్రపంచంలో వరుసగా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. రీసెంట్గా నటుడు జయప్రకాష్ రెడ్డి మరణించగా.. తాజాగా విలక్షణ నటుడు, నిర్మాత అయిన అశోక్ రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయనకు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అశోక్ కుమార్ మాతృమూర్తి కె.వసుంధరాదేవి (88) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. దీంతో అశోక్ కుమార్ ను సినీ ప్రముఖులు పరామర్శించారు. విలక్షణ నటనకు పెట్టింది పేరైన అశోక్ కుమార్ ఎన్నో చిత్రాల్లో నటించి, మంచి చిత్రాలను నిర్మించాడు.
ఇక అశోక్ కుమార్ విషయానికొస్తే.. ఈయన నిర్మాతగా 'రక్త తిలకం', 'ధృవ నక్షత్రం', 'చెవిలో పువ్వు', 'ప్రేమంటే ఇదేరా', 'ఈశ్వర్' 'జయదేవ్' వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. ఈయన నిర్మాతగానే కాకుండా.. నటుడిగా 'భారత్ బంధ్' సినిమాతో తెరంగేట్రం చేసాడు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో ఓవర్ నైట్ నటుడిగా పాపులర్ అయ్యాడు. ఇక అపట్లో విలనిజం పండించడంలో అశోక్ కుమార్ కేరాఫ్ అడ్రస్గా నిలిచేవారు.