Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శ్రీరెడ్డి సపోర్టుతో ఫిర్యాదు: జూనియర్ ఆర్టిస్టును మోసం చేసిన బాలాజీపై కేసు!
జూనియర్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మిని మోసం చేసిన ఘటనలో సినీ నటుడు బాలాజీపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కిడ్నీ మార్పిడి విషయంలో ప్రాథమిక సాక్ష్యాలు దొరకడంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 420తో పాటు, మానవ అవయవాల మార్పిడి చట్టం 1994లోని సెక్షన్ 19 ప్రకారం కేసు నమోదు చేశారు. కిడ్నీ ఆపరేషన్ విజయవాడలో జరుగడంతో కేసును అక్కడికి బదిలీ చేశారు.
సినీ నటుడు బాలాజీ తన భార్యకు కిడ్నీ ఇస్తే రూ. 20 లక్షలు ఇస్తానని నమ్మించాడని, భర్త పోయిన తర్వాత కుటుంబ భారం మోయలేక అప్పులపాలైన తాను...... గతి లేని పరిస్థితుల్లో కిడ్నీ అమ్ముకున్నానని జూనియర్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
సినిమాలు, టీవీ సీరియల్స్లో అవకాశాలతో పాటు రూ. 20 లక్షల క్యాష్, ఆపై నెలకు రూ. 15 వేల సాయం చేస్తానని నమ్మించి... పని అయిపోయిన తర్వాత చేతులెత్తేశాడని లక్ష్మీ ఆరోపించారు. ఆసుపత్రిలో తెల్లకాగితాలపై సంతకం చేయించుకుని డబ్బు మొత్తం ముట్టినట్లు దబాయించి మోసం చేశాడని లక్ష్మి ఆరోపించారు.
జూనియర్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మికి నటి శ్రీరెడ్డి మద్దతుగా నిలిచారు. జూబ్లీహిల్స్ పోలీసులు, మానవహక్కుల కమిషన్, మా అసోసియేషన్ లకు ఈ విషమై ఫిర్యాదు చేశారు. ఆమెకు న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని తెలిపారు.
ఇండస్ట్రీల్లో దిక్కు మొక్కులేని జూనియర్ ఆర్టిస్టులు, చిన్న చిన్న యాక్టర్స్కు ఇపుడు శ్రీరెడ్డి పెద్ద అండగా కనిపిస్తోంది. ఇంతకాలం తమకు అన్యాయం జరిగితే ఎవరికీ చెప్పుకోవాలో తెలియక, పోలీసులకు ఫిర్యాదు చేసే దైర్యం లేక మిన్నకుండి పోతున్న భాగ్యలక్ష్మి లాంటి వారు శ్రీరెడ్డి సహాయం తీసుకుంటున్నారు.