Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హీరోపై దాడి చేసిన ఎస్సై, కమీషనర్కు ఫిర్యాదు
బెంగుళూరు: తనపై అనవసరంగా దాడి చేసాడని కన్నడ యాక్టర్ చేతన్ కుమార్ బెంగులూరు సిటీ పోలీస్ కమీషనర్కు ఫిర్యాదు చేసారు. ఈ నెల 24న రాత్రి 1.30 గంటలకు తన స్నేహితులతో కలిసి చర్చ్ స్ట్రీట్ లో ఉండగా కబ్బర్ పార్క్ పోలీస్ సబ్ ఇన్స్ స్పెక్టర్ నవీన్ తనపై దాడి చేసాడంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
గురువారం కమీషనర్ ఎంఎన్ రెడ్డిని చేతన్ కుమార్ కలిసారు. ఫిర్యాదు సమయంలో అతనితో పాటు యాక్టర్, ఎంఎల్సి తారా కూడా ఉన్నారు. ఈ కేసు గురించి బెంగులూరు సెంట్రల్ జోన్ డిసీపీ సందీప్ పాటిల్ మాట్లాడుతూ చేతన్ కుమార్ ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. కబ్బన్ పార్క్ ఏసిపి శోభా రాణి ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నారని, ఆమె ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు.
చేతన్ కుమార్ పై దాడి చేసినట్లు ఆరోపణ ఎదుర్కొంటున్న ఎస్సై నవీన్.....కమీషనర్ ఎంఎన్ రెడ్డి పర్సనల్ స్టాఫ్ కుమారుడు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో విచారణ ఎలా ఉంటుందనేది చర్చనీయాంశం అయింది.
చేతన్ కుమార్ గురించిన వివరాల్లోకి వెళితే యూఎస్లో పుట్టి పెరిగిన చేతన్ కుమార్ ఇటీవల ‘ఆ దినగలు' అనే కన్నడ చిత్రం ద్వారా వెండి తెర అరంగ్రేటం చేసారు. తొలి సినిమా తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.