Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చెంపదెబ్బ: అభిమానికి హీరో రూ. 5 లక్షల పరిహారం!
హైదరాబాద్: బాలీవుడ్ హీరో గోవింద కొన్నేళ్ల క్రితం తాను చెంపదెబ్బ కొట్టిన కేసులో అభిమానికి రూ. 5 లక్షల పరిహారం ఇచ్చారు. 2008లో గోవిందా చెంప దెబ్బ కొట్టగా....అందుకు సంబంధించిన కేసు సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. ఎట్టకేలకు గోవింద క్షమాపణ చెప్పి 5 లక్షల పరిహారం అందించడంతో కేసు ముగిసింది.
2008లో క్రితం గోవింద హీరోగా నటిస్తున్న 'మనీ హైతో మనీ హై' చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉత్తర ముంబయి పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీగా గోవిందా ఉన్నాడు. సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటూ నియోజకవర్గ సమస్యలను గాలికి వదిలేశారన్న సంతోష్ రాయ్ అనే వ్యక్తి వ్యాఖ్యలకు ఆగ్రహించిన గోవిందా అతని చెంపపై కొట్టాడు.
గోవిందా తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ సంతోష్ రాయ్ బాంబే హైకోర్టులో 2013లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, ఈ సంఘటన జరిగిన ఏడాది తర్వాత కేసు నమోదు చేశాడన్న కారణంతో 2013లో హైకోర్టు ఈ కేసును కొట్టేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే తాను రూ. ఐదారు లక్షలు ఖర్చు చేశానంటూ సంతోష్ రాయ్ 2014లో సుప్రీంకోర్టుకు వెళ్లాడు.
ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు.... క్షమాపణలు చెప్పాల్సిందిగా గోవిందకు సూచించింది. ఎట్టకేలకు ఈ విషయంలో గోవింద కిందకి దిగిరాక తప్పలేదు. సంతోష్ రాయ్ కి క్షమాపణలు చెప్పడంతో పాటు రూ. 5 లక్షల పరిహారం అందించారు.