Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
దేవుళ్లు వాళ్లే.. లెజెండ్ మూడేళ్లు ఆడింది.. నంది అవార్డుపై జగపతిబాబు కామెంట్
రక్తదానం చేయడంపై అందరూ దృష్టిపెట్టాలి అని విలక్షణ నటుడు జగపతిబాబు అన్నారు. రోగులకు, ప్రమాదానికి గురైన వారు సరైన సమయంలో రక్తం అందకపోవడంతో చనిపోయారు అని చాలా సార్లు విన్నాను. అందుకే ఎన్టీఆర్, బసవతారక క్
రక్తదానం చేయడంపై అందరూ దృష్టిపెట్టాలి అని విలక్షణ నటుడు జగపతిబాబు అన్నారు. రోగులకు, ప్రమాదానికి గురైన వారు సరైన సమయంలో రక్తం అందకపోవడంతో చనిపోయారు అని చాలా సార్లు విన్నాను. అందుకే ఎన్టీఆర్, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్లో ఇటీవల ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న అనంతరం జగపతిబాబు మీడియాతో మాట్లాడారు.
ఆపదలో ఆదుకొనే వాడే దేవుడు
దేవుడు ఎక్కడ ఉన్నారు అని అందరూ అని అడుగుతుంటారు. నన్నడిగితే సరైన సమయంలో ఆపదలో ఉన్నవారికి రక్తం అందించే వ్యక్తి, దానం చేసే వ్యక్తి దేవుడు అని నేను నమ్ముతాను అని జగపతి అన్నారు.
రక్తదానం చేయ్యాలి..
ఎలాంటి లాభాపేక్ష లేకుండా, సమాజ సేవ కోసం ఆలోచించి రక్తదానం అందిస్తే సాటి మనిషి ప్రాణాలు నిలబెట్టే దేవుడి అవుతాం అని జగపతి బాబు చెప్పారు.
మంచి చెడు మీరే చెప్పాలి
లెజెండ్ విలన్ పాత్ర పోషించాను. ఇప్పుడు నేను రక్తదానం చేస్తున్నాను. నేను మంచివాడినా లేదా చెడ్డవాడినా అనేది మీరే చెప్పాలి. రక్తదానం శిబిరం నిర్వహిస్తున్నారని తెలిసి వచ్చి బ్లడ్ డొనేట్ చేశాను. అందరూ చేయాల్సిన అవసరం ఉంది.
నా తొలి చిత్రం మూడురోజులే
నా మొదటి సినిమా సింహస్వప్పం. ఆ సినిమా మూడు రోజులు ఆడింది. నేను విలన్గా చేసిన చిత్రం లెజెండ్ మూడు సంవత్సరాలు ఆడింది. విలన్ ఆ చిత్రంలో చేసిన పాత్రకు నాకు నంది అవార్డు లభించింది. ఆ పాత్రకు మంచి పేరు కూడా వచ్చింది.
నంది అవార్డులపై నో కామెంట్
నంది అవార్డులు వివాదంగా మారడంపై నేను కామెంట్ చేయబోను. అది మీడియా, జ్యూరీకి సంబంధించిన విషయం. దానిపై మీరే తేల్చుకోవాలి అని జగపతిబాబు చమత్కరించారు.