Don't Miss!
- News కడపలో వైఎస్ షర్మిలకు ప్లస్ గా వైఎస్ వివేకా సతీమణి సౌభాగ్యమ్మ లేఖాస్త్రం!!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాళ్ల దాడి: కంటి చూపు కోల్పోయే స్థితిలో ప్రముఖ నటుడు!
బాడీగార్డ్, సోల్జర్ లాంటి పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు జీతూ వర్మపై దాడి జరిగింది. ఇటీవల జైపూర్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్: బాడీగార్డ్, సోల్జర్ లాంటి పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు జీతూ వర్మపై దాడి జరిగింది. ఇటీవల జైపూర్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మౌంట్ అబూ నుంచి రాజస్థాన్ రాజధాని జైపూర్కు వెలుతూ చిత్తోడ్గఢ్ అటవీ ప్రాంతాన్ని దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు జీతూ వర్మపై దాడి చేసారు.
ఈ దాడిలో జీతూ వర్మ కంటి చూపు కోల్పోయే స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో దాడి జరిగడంతో దాడికి ఎవరు పాల్పడ్డారనేది తెలియడం లేదు. దారి దోపిడీ ముఠాలే రాత్రి వేళలో ఇలాంటివి చేస్తుంటారని ఆ ప్రాంతం వారు అంటున్నారు.
ప్రమాదకరమైన అటవీ ప్రాంతం
చిత్తోడ్గఢ్ అటవీ ప్రాంతం దాదాపు 40 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ప్రయాణ సమయంలో జీతూ డ్రైవర్ పక్కన ముందు సీట్లోనే కూర్చున్నాడు. ఉన్నట్టుండి కారుపై రాళ్లు పడటం మొదలవ్వడంతో ప్రమాదాన్ని ఊహించిన డ్రైవర్ ఆపకుండా వేగంగా కారును ముందుకు నడిపించాడు.
కంటికి తీవ్రగాయం
దాదాపు కిలో మీటర్ మేర రాళ్ల దాడి జరిగింది. అందులో ఓ రాయి కారు అద్దాన్ని చీల్చు కుంటూ జీతూ వర్మ కంటికి బలంగా తగిలి తీవ్ర గాయం అయింది. సమీపంలోని టోల్ బూత్ దగ్గర కారును ఆపి పోలీసులకు సమాచారం అందించారు.
గతంలో సంజయ్ లీలా భన్సాలీపై దాడి
గతంలో ఇదే ప్రాంతంలో డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీపైనా దాడి జరిగింది. ఇపుడు జీతూ వర్మపై కూడా దాడి జరుగడంతో పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఆ ప్రాంతంలో గస్తీ పెంచారు.
కంటిచూపు పోయే స్థితిలో జీతూ
జీతూ కంటికి ముంబైలోని ప్రముఖ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేశారు. కనుబొమ్మ చిట్లి అక్కడ ఎముక ఫ్రాక్చర్ అయిందని, కనుబొమ్మకు పది కుట్లు పడ్డాయి. గాయం వల్ల కంటిలో రెటీనా పనిచేయట్లేదని, కంటి చూపు పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారు