లావణ్య త్రిపాఠికి షాకిచ్చిన నిర్మాత.. రూ.3 కోట్ల జరిమానా!
టాలీవుడ్ అందాల తార లావణ్య త్రిపాఠికి ఎదురు దెబ్బ తగిలింది. ఓ సినిమా కాంట్రాక్టు నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో ఆమెకు తమిళ సినీ నిర్మాతల సంఘం భారీ జరిమానా విధించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 100%
టాలీవుడ్ అందాల తార లావణ్య త్రిపాఠికి ఎదురు దెబ్బ తగిలింది. ఓ సినిమా కాంట్రాక్టు నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో ఆమెకు తమిళ సినీ నిర్మాతల సంఘం భారీ జరిమానా విధించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 100% లవ్ తమిళ రీమేక్ చిత్ర వ్యవహారం వివాదంగా మారింది. దీనిపై లావణ్య త్రిపాఠి ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. వివరాల్లోకి వెళితే..
Recommended Video


తమిళంలో 100% కాదల్
తెలుగులో ఘనవిజయం సాధించిన సుకుమార్ చిత్రం 100% లవ్ చిత్రాన్ని తమిళంలో 100% కాదల్ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో తమన్నా నటించిన పాత్రను లావణ్య త్రిపాఠి పోషించేందుకు ఒప్పుకొన్నారు.

తప్పుకొన్న లావణ్య త్రిపాఠి
100% కాదల్ చిత్ర షూటింగ్ ప్రారంభం అయ్యే సమయంలో ఏదో కారణంతో ఈ సినిమా నుంచి తప్పుకొన్నది. దాంతో ఆ చిత్ర షూటింగ్ను వాయిదా వేయాల్సి వచ్చిందట. దాంతో నిర్మాతలకు దాదాపు రూ.3 కోట్ల నష్టం వాటిల్లినట్టు సమాచారం.

లావణ్య స్థానంలో శాలిని పాండే
ప్రస్తుతం 100% కాదల్ చిత్రంలో లావణ్య త్రిపాఠి స్థానంలో అర్జున్ రెడ్డి ఫేం శాలిని పాండేను తీసుకొన్నట్టు సమాచారం. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ నటించనున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్టు తెలుస్తున్నది. ఈ చిత్రానికి నిర్మాతగా సుకుమార్, భువన చంద్రమౌళి వ్యవహరిస్తున్నారు.

3 కోట్ల జరిమానా
లావణ్య కాంట్రాక్టు ఉల్లంఘించడం వల్ల వచ్చిన నష్టాన్ని చెల్లించాలని సదరు నిర్మాత తమిళ నిర్మాతల సంఘాన్ని ఆశ్రయించారట. లావణ్య త్రిపాఠిపై నిర్మాత చేసిన ఫిర్యాదును పరిశీలించిన తర్వాత లావణ్య త్రిపాఠికి 3 కోట్ల జరిమానా విధించినట్టు సమాచారం. అయితే ఈ విషయంపై లావణ్య నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

సాయి ధరమ్ తేజ్తో
కాగా, లావణ్య త్రిపాఠి నటించిన ఉన్నది ఒకటే జిందగీ చిత్రం మంచి టాక్ను సంపాదించుకొన్నది. ఈ చిత్రంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్, అనుపమ పరమేశ్వరన్ సరసన లావణ్య నటించింది. సాయి ధరమ్ తేజ్తో లావణ్య ఓ చిత్రంలో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











