twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో హీరో నితిన్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నాగార్జున హోస్టుగా నిర్వహిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' 2వ సీజన్ ఈనెల 8 నుంచి ప్రారంభంకాబోతోంది. గత సీజన్లో ఈ షోలో మధ్య మధ్యలో పలువురు స్టార్స్ ఎంట్రీ ఇచ్చి సందడి చేసారు. సెకండ్ సీజన్లో కూడా ఈ సాంప్రదాయం కొనసాగనుంది. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కూడా ఈ షోలో దర్శనమివ్వబోతున్నారు.

    ఇటీవలే నితిన్ పాల్గొన్న కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఈ విషయాన్ని నితిన్ తన ట్విట్టర్లో వెల్లడించారు. "'మీలో ఎవరు కోటీశ్వరుడు' గేమ్ షో నాగార్జునగారితో చిత్రీకరణ పూర్తయింది... చాలా సరదాగా ఉంది!!" అని నితిన్ చెప్పాడు. గత సీజన్లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించి సూపర్ హిట్టయింది. ఈ సీజన్లో మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని నిర్వాహకులు భావిస్తున్నారు.

    Actor Nitin Reddy participated in Meelo Evaru Koteeshwarudu

    ఇక నితిన్ సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం నిటిన్ నటించిన ‘చిన దాన నీకోసం' చిత్రం ఈ నెల 25న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి "అమృతం" ఫేం హర్షవర్థన్ మాటలు అందిస్తున్నాడు. ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే చిత్రాలలకు సంగీతం అందించిన అనూప్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని నితిన్ సోదరి నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. నితిన్ సరసన మిష్టి చక్రవర్తి నటిస్తోంది. సాఫ్ట్ లవ్ స్టోరీస్ తో ప్రేక్షకులను మెప్పించే కరుణాకరన్, నితిన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం అంచనాలు భారీగానే ఉన్నాయి.

    English summary
    Actor Nitin Reddy participated in Meelo Evaru Koteeshwarudu. "Just fini playing the game show M.E.KOTEESWARUDU with NAGARJUNA garu..was super fun!!" Nitin tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X