Don't Miss!
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రేప్ కేసులో టీవీ నటుడికి బెయిల్.. నిర్మాత ఏక్తా కపూర్పై భగ్గుమంటున్న నెటిజన్లు
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న టెలివిజన్ నటుడు పర్ల్ వీ పూరికి ఏక్తా కపూర్ మద్దతుగా నిలువడంపై నెటిజన్లు భగ్గుమన్నారు. తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఓ మైనర్ బాలిక ముంబైలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పర్ల్ వీ పూరీని జూన్ 4వ తేది రాత్రి అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఆయనకు పలువురు సినీ తారలు, ప్రముఖులు ససోర్టుగా నిలవడం వివాదంగా మారింది.
అయితే ఓ బాలికపై వ్యానిటీ వ్యాన్లో దారుణంగా రేప్కు పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పూరీకి ఏక్తా కపూర్ మద్దతు తెలపడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ కేసులో బెయిల్ పొందిన పర్ల్ వీ పూరిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఓ రేప్ కేసులో నిందితుడైన టెలివిజన్ నటుడికి నిర్మాత ఏక్తా కపూర్ ఎలా మద్దతు తెలుపుతారు. ఏక్తా కపూర్ కారణంగానే పర్ల్ వీ పూరీకి బెయిల్ లభించింది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పోస్కో కేసులో అంత సులభంగా బెయిల్ ఎలా లభిస్తుంది. మెడికల్ రిపోర్టుల్లో ఏముందో వెల్లడించాలి. చట్టానికి అతీతంగా ఏక్తాకపూర్ వ్యవహరిస్తున్నది అని నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.
నటుడు పర్ల్ వీ పూరిపై జూన్ 4వ తేదీ రాత్రి ముంబైలోని వాలివ్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్ చేశారు. అతడిపై చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోస్కో) యాక్ట్ కింద కేసు నమోదు అయింది అని పోలీసుల వర్గాలు వెల్లడించారు.
పర్ల్ వీ పూరి కెరీర్ విషయానికి వస్తే ఆయన 2019లో దిల్ కీ నజర్ సే ఖూబ్ సూరత్ అనే సీరియల్తో హిందీ వినోదరంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఫిర్ బీ నా మానే, బత్తమీజ్ దిల్ సీరియల్తో పాపులారిటీని సంపాదించారు. నాగిన్ 3, నాగార్జున ఏక్ యోధ, బేపనా ప్యార్ సీరియల్స్తో మరింత పాపులారిటీని సొంతం చేసుకొన్నారు. ప్రస్తుతం బ్రహ్మరాక్షస్ 2 టీవీ సీరియల్లో నటిస్తున్నారు.