Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఎంపీగా నామినేషన్ వేసిన ప్రకాష్ రాజ్, అతడికి ఏం అర్హత ఉందంటూ..
బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన శుక్రవారం బెంగుళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్ వేసిన అనంతరం ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ... బీజేపీ, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలు ప్రజల్లో విఫలం అయ్యాయని, జనం గొంతు పార్లమెంటులో వినిపించాలనే లక్ష్యంతో స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
ప్రకాష్ రాజ్
ప్రకాష్ రాజ్ కొంతకాలంగా బీజేపీకి వ్యతిరేకంగా తన గళం విప్పుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సామాజిక సమస్యలపై మాట్లాడుతున్నారు. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. తన స్నేహితురాలు, జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యపై న్యాయం కోరుతూ ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ సంచలనం అయ్యాయి.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది ఒక పండగ
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది పండగ. ఓటు అనేది ఒక పేపర్ ముక్క కాదు. దాని ద్వారా మన హక్కు, మన ఆలోచన, దేశం మీద మనకు ఉన్న ప్రేమ, మనం ఎవరిని ఎన్నుకుంటున్నామని చెప్పే ఒక సాధనం. ఇలాంటి పండుగలో నేను భాగం కావడం, నా వెనక ఇంత మంది రావడం ఆనందంగా ఉంది. వారిని లక్షలు ఖర్చు పుట్టి డబ్బుతో తీసుకురాలేదు. యువత, మహిళల మద్దతు నాకు ఉంది. వారి తరుపున పార్లమెంటులో ఒక గొంతు వినిపించాలనే నేను పోటీ చేస్తున్నట్లు తెలిపారు. 2019 ఎన్నికల తర్వాత దేశంలో మార్పు వస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు.
అడ్డంగా బుక్కైన ప్రకాష్ రాజ్.. పోలిసుల వద్ద ఆధారాలు!
బెంగుళూరు సెంట్రల్
బెంగుళూరు సెంట్రల్ నుంచి... బీజేపీ తరుపున సిట్టింగ్ ఎంపీ పిసి మోహన్ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ప్రకాష్ రాజ్కు ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.
అతడికి ఏం అర్హత ఉంది?
మాండ్య నుంచి సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ పోటీ చేస్తున్నారు. అర్హత ఉన్న వారు పోటీ చేయాలనేది నా అభిప్రాయం. అతడికి ఏం తెలుసు? మొన్ననే సినిమాల్లోకి వచ్చాడు.. అని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుమలత నాకు చాలా కాలంగా తెలుసు. ఆమెకు రాజకీయాలపై మంచి అవగాహన ఉందన్నారు ప్రకాష్ రాజ్.