Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘మా’ ఎన్నికలు: కుట్రలేదు, చిరంజీవిగారే క్లీన్ చిట్ ఇచ్చారంటూ... నరేష్ మీద పృథ్వి ఫైర్
'మావీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికల్లో పోటీ చేస్తున్న శివాజీ రాజా ప్యానల్, నరేష్ ప్యానల్ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ఎలక్షన్ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. 'మా' ఎన్నికల వ్యవహారాన్ని మీడియా దృష్టికి తీసుకెళ్లి, ఛానల్స్లో డిబేట్లు పెట్టడంపై శివాజీ రాజా ప్యానల్ మండి పడుతోంది.
తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో శివాజీ రాజా ప్యానల్ తరుపున ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా పోటీ చేస్తున్న పృథ్వి రాజ్... నరేష్ ప్యానల్ మీద విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు.
కెజిఎఫ్ డైరెక్టర్తో చర్చలు.. మహేష్ బాబు నుంచి ప్యాన్ ఇండియా మూవీ?
రాష్ట్ర ప్రజలు చూసే రాజకీయం కాదు
‘చంద్రలేఖ' సినిమా సమయంలో మురళీ మోహన్ గారు రూ. 5 వేలు కట్టండి ‘మా'లో సభ్యత్వం ఇస్తామంటే.. అప్పుడు కట్టే స్థోమత లేక తీసుకోలేదు. అలాంటి నేను రెండేళ్ల క్రితం రూ. లక్ష కట్టి కార్డు తీసుకున్నాను. ‘మా' కుటుంబం నటీనటుల కుటుంబం. ఇందులో 800 మంది ఉన్నారు. రాష్ట్ర ప్రజలు చూసే రాజకీయం కాదు ఇది. మన కుటుంబంలో ఉన్న సమస్యలను అంతర్గతమైనవి. మనమే పరిష్కరించుకోవాలి. నాకు శివాజీ రాజాగారి ప్యానల్ మంచి ప్యానల్ అనిపించింది. మంచి కార్యక్రమాలకు నావంతు మద్దతు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఇందులోకి వచ్చాను.... అని పృథ్వి రాజ్ తెలిపారు.
పదవి ఇస్తే ఏం చేశారు?
మీరు (నరేష్ ప్యానల్) ఒక్క ఛాన్స్.. ఒక్క ఛాన్స్ అని ప్రచారం చేస్తున్నారు. మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చాం. జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చాం. ప్రెసిడెంట్ కంటే పవర్ఫుల్. కానీ మీరు ఏం చేశారు? మీ అటెండెన్సే లేదు. మీరు పరీక్ష ఎలా రాస్తారు? అలాంటి మీకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే ఏం చేయగలరు... అని పృథ్వి ప్రశ్నించారు.
అంత అవసరం ఏమిటి?
మీకు ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ప్రెసిడెంట్ పదవి ఇస్తే అందరినీ మీడియా ఛానల్స్ వద్దకు తీసుకెళతారు. ఈ రోజు ఇక్కడ చక్కగా ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. తెలుగు ప్రజలకు, భారత దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఏముంది? మీరు మీడియా ఛానల్స్కు వెళ్లాల్సిన అవసరం ఏమిటి? అంటూ పృథ్వి మండి పడ్డారు.
శివాజీ రాజా, శ్రీకాంత్ పర్ఫెక్ట్
శివాజీ రాజా, శ్రీకాంత్ నాకు చాలా ఏళ్లుగా తెలుసు. నిబద్దత లేకుండా, నిలకడ లేకుండా మాట్లాడే మనుషులు కాదు. తప్పు చేస్తే గుండు గీయించుకుని వెళ్లి పోతా నా పిల్లల సాక్షిగా, భగవంతుడి సాక్షిగా అని ఎవరూ చెప్పరు... శివాజీ రాజా మాత్రమే చెప్పారు. శివాజీ రాజాగారు ఏం చేశారో అందరికీ తెలుసు. అందుకే ఆయన్ను మళ్లీ ప్రెసిడెంటుగా ఎన్నుకుంటున్నామన్నారు.
మీ అమ్మగారు కాదు.. మీరు ఏం చేశారు?
మీరు(నరేష్) చేసింది ఏమీ లేదు. ఏమైనా అంటే మా అమ్మగారు చేశారు అంటారు. మీ అమ్మగారు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచే చేస్తున్నారు. ఇక్కడ అది విషయం కాదు. మీరు టీవీ ఛానల్స్ ముందు కూర్చుని పబ్లిక్కు రాంగ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ‘మా' విషయం పబ్లిక్ కు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ‘మా' కుటుంబ సభ్యుల వ్యవహారం. మనం బాగుపడాలని ఏర్పాటు చేసుకున్న అసోసియేషన్. శివాజీ రాజాగారు అద్భుతంగా పని చేశారు కాబట్టే ఆయన్ను రెండో సారి ప్రెసిడెంటుగా నిలబెట్టాం.
చిరంజీవిగారే క్లీన్ చిట్ ఇచ్చారు
ఏవో కుట్రలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. అమెరికాలో జరిగిన కార్యక్రమానికి కోటి రూపాయలు ఇచ్చారు అగ్రిమెంట్ అయిపోయింది. ఈ అగ్రిమెంట్ ఓకే చేసిన జేఏసీలో కెఎల్ నారాయణ లాంటి పెద్ద పెద్దవారు ఉన్నారు. చిరంజీవిగారు కూడా తెప్పించుకుని చూశారు. ఎక్కడా అవకతవకలు జరుగేలదని క్లీన్ చిట్ ఇచ్చారు. కాంట్రాక్టర్ ఎక్కువ సంపాదించుకుంటే అది ‘మా'కు సంబంధం లేదు. కావాలని శివాజీ రాజామీద, శ్రీకాంత్ మీద బురద జల్లడం సరికాదు.. అంటూ పృథ్వి ఫైర్ అయ్యారు.
ఎవరినీ లాగలేదు
జీవితగారేమో మమ్మల్ని లాగారు మమ్మల్ని లాగారు అంటారు. ఎవరూ ఎవరినీ లాగడం లేదు. అన్ని ఛానల్స్ తిరగాల్సిన అవసరం లేదు. మంచి ఎక్కడ ఉంటే అభివృద్ధి అక్కడ ఉంటుంది. అది శివాజీ రాజాతోనే సాధ్యం. ఎవరి మీద మాకు వ్యక్తిగత ద్వేషాలు లేవని... పృథ్వి రాజ్ స్పష్టం చేశారు.