Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరో రాజశేఖర్ ఇంట విషాదం
సినీ హీరో రాజశేఖర్ మాతృమూర్తి ఆండాళ్ వరదరాజ్(82) బుధవారం ఉదయం మృతిచెందారు. గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆమెను హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.
సినీ హీరో రాజశేఖర్ మాతృమూర్తి ఆండాళ్ వరదరాజ్(82) బుధవారం ఉదయం మృతిచెందారు. గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆమెను హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆమెకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు కాగా అందులో రాజశేఖర్ రెండో సంతానం. ప్రస్తుతం ఆండాళ్ వరదరాజ్ పార్ధీవ దేహాన్ని సాయంత్రం 5గంటల వరకు అపోలో ఆసుపత్రిలో ఉంచుతారు. అనంతరం చెన్నైకి తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
చాలా రోజులుగా సరైన హిట్ లేక ఇబ్బందుల్లో ఉన్న సీనియర్ హీరో రాజశేఖర్ త్వరలో 'పియస్ వి గరుడ వేగ 126.18 ఎమ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజశేఖర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకుడు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా విషయంలో తలమునకలుగా ఉన్న రాజశేఖర్ కి ఇప్పుడు తల్లి మరణం మరో దెబ్బ అనే చెప్పుకోవాలి.