Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జూ ఎన్టీఆర్ ఫ్రెండ్ భూమి కబ్జా చేసారు
హైదరాబాద్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రాణ స్నేహితుల్లో ఒకరైన రాజీవ్ కనకాల హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. కొందరు అక్రమార్కులు వారి కుటుంబానికి చెందిన భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతుండటంతో ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
కబ్జాకు గురైన స్థలం రాజవ్ కనకాల తండ్రి దేవదాసు కనకాల పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఈ స్థలంలో గత ఆర్థరాత్రి దుండగులు ప్రవేశించి... అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ విషయాన్ని స్థానికులు వెంటనే దేవదాసు కనకాలకు సమాచారం అందించారు.
అక్కడికి వెళ్లగా కబ్జా దారులు రాజీవ్ కనకాల, దేవదాసు కనకాలతో గొడవకు దిగారు. దీంతో వెంటనే వారు హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన బట్టి హైదరాబాద్ లో కబ్జాదారుల ఆగడాలు ఏ రేంజిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సెలబ్రిటీల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యులు పరిస్థితి ఏమిటని సమాన్యులు ప్రశ్నిస్తున్నారు.