Don't Miss!
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
జూ ఎన్టీఆర్ ఫ్రెండ్ భూమి కబ్జా చేసారు
హైదరాబాద్: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రాణ స్నేహితుల్లో ఒకరైన రాజీవ్ కనకాల హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. కొందరు అక్రమార్కులు వారి కుటుంబానికి చెందిన భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతుండటంతో ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
కబ్జాకు గురైన స్థలం రాజవ్ కనకాల తండ్రి దేవదాసు కనకాల పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఈ స్థలంలో గత ఆర్థరాత్రి దుండగులు ప్రవేశించి... అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ విషయాన్ని స్థానికులు వెంటనే దేవదాసు కనకాలకు సమాచారం అందించారు.
అక్కడికి వెళ్లగా కబ్జా దారులు రాజీవ్ కనకాల, దేవదాసు కనకాలతో గొడవకు దిగారు. దీంతో వెంటనే వారు హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన బట్టి హైదరాబాద్ లో కబ్జాదారుల ఆగడాలు ఏ రేంజిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సెలబ్రిటీల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యులు పరిస్థితి ఏమిటని సమాన్యులు ప్రశ్నిస్తున్నారు.