Don't Miss!
- News కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్: ఏమన్నారంటే?
- Sports PBKS vs MI: తొండాటకు ముగింపు.. కెమెరా ముందు టాస్ కాయిన్ ఫలితం! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సినీ ఆర్టిస్ట్ అవుతాననుకోలేదు : రావు రమేష్
నా తండ్రి రావుగోపాలరావుకు కూడా తనను సినీ పరిశ్రమలోకి తీసుకురావాలనే ఆలోచన ఉండేది కాదన్నారు. తన తండ్రిగోపాలరావు 1994లో మృతి చెందితే తాను 2008లో అంటే 14 ఏళ్ల అనంతరం సినీ పరిశ్రమలో అడుగు పెట్టానన్నారు. సినీ పరిశ్రమలో కష్టపడితే వారసత్వాలతో పనిలేదని గుర్తింపు దానికదే వస్తుందన్నారు. తాను, గిరిబాబు తనయుడు రఘుబాబు ఒకేసారి సినీరంగ ప్రవేశం చేశామన్నారు.
2008లో నాతొలి చిత్రం గమ్యం కాగా, నాకు సినీరంగంలో టర్నింగ్ పాయింట్ ఇచ్చింది మాత్రం కొత్త బంగారు లోకం చిత్రమన్నారు. ఇంకా ఇటీవల కాలంలో అత్తారింటికి దారేది, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, మగధీర వంటి చిత్రాలు కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయన్నారు. తాను ఇంత వరకు సుమారు 60 చిత్రాల్లో నటించానన్నారు. మంచి క్యారెక్టర్లు వస్తే ఇంకా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. పలు ఆఫర్లు కూడా వచ్చి ఉన్నాయన్నారు.
మంచి దర్శకుల వద్ద నటించేందుకు నాకు అవకాశాలు వచ్చాయని, ఒక్కొక్క దర్శకుని నుంచి ఒక్కో మంచి విషయాన్ని తెలుసుకున్నానన్నారు. తనకు రెండు అవార్డులు వచ్చాయని, అయితే సినీ పరిశ్రమలో ఆకలితో ఉన్న సమయంలో కళాకారులను గుర్తించరని, మంచి స్థాయికి ఎదిగిన అనంతరం గుర్తిస్తారన్నారు. అందువల్ల అవార్డుల కోసం తాను అంతగా తపించనన్నారు. కష్టపడితే గుర్తింపు అనేది దానికదే రావడంతో పాటు ప్రేక్షకులు గుర్తించి అభిమానిస్తారన్నారు.