Don't Miss!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
శ్యాం కే నాయుడు కేసులో కొత్త ట్విస్టు.. మళ్లీ మోసం అంటూ కోర్టుకెక్కిన నటి సాయిసుధ
సినిమాటోగ్రాఫర్ శ్యాం కే నాయుడు, వర్థమాన నటి శ్రీ సాయి సుధ రిలేషన్షిప్ కేసు మరో మలుపు తిరిగింది. తనను మోసగించాడనే ఆరోపణలపై శ్యాం కే నాయుడుపై మే 27వ తేదీన హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో సాయి సుధ కేసు నమోదు చేయడం సినీవర్గాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి శ్యాం ఫోర్జరీకి పాల్పడ్డారనే విషయంపై ఫిర్యాదు చేయడం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ కేసులో ఏం జరిగిందంటే..
Recommended Video
సాయిసుధతో రిలేషన్షిప్ అలా
పోకిరి, టెంపర్ చిత్రాలకు సినిమాటోగ్రఫి అందించిన శ్యాం కే నాయుడు వైవాహిక జీవితంలో కలతలు చోటుచేసుకొన్నాయి. ఆ క్రమంలో అర్జున్ రెడ్డి లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకొంటున్న సాయిసుధకు శ్యాం చేరువయ్యారు. ఆ తర్వాత పెళ్లి చేసుకొందామనే అవగాహనతో వారిద్దరూ సహజీవనం చేశారు. అయితే పెళ్లికి సుముఖంగా లేకపోవడంతో సాయిసుధ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మోసగించాడనే ఫిర్యాదుతో
సాయిసుధ ఫిర్యాదుతో శ్యాం కే నాయుడుని ఎస్ఆర్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఆ తర్వాత ఆయన బెయిల్పై విడుదల అయ్యారు. ఇప్పుడు బెయిల్పై విడుదల కావడం వివాదంగా మారింది. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తప్పుడు బెయిల్ పత్రాలను సృష్టించారు. వాటి ఆధారంగానే శ్యాం విడుదల చేశారనే ఆరోపణలతో మరోసారి ఫిర్యాదు చేశారు.
సంతకం ఫోర్జరీ చేసి బెయిల్
తాజాగా మీడియాలో వచ్చిన కథనాలను బట్టి.. సాయిసుధ సంతకాన్ని ఫోర్జరీ చేసి బెయిల్ పత్రాలను సమర్పించారు. వారి మధ్య అవగాహన కుదిరినట్టు కోర్టుకు పత్రాలను దాఖలు చేశారు. అయితే వారి మధ్య అవగాహన కానీ, రాజీ గానీ జరుగలేదనే విషయం బయటకు వచ్చింది.
సాయిసుధ నాంపల్లి కోర్టులో ఫిర్యాదు
ఇదిలా ఉండగా, తప్పుడు బెయిల్ పత్రాలు సమర్పించి శ్యాం కే నాయుడు బెయిల్ పొందారు అని సాయి సుధ తాజాగా కోర్టుకు ఫిర్యాదు చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. సాయి సుధ ఫిర్యాదు మేరకు నాంపల్లి కోర్టు శ్యాం కే నాయుడు బెయిల్ను రద్దు చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ ఫిర్యాదు, బెయిల్ రద్దు వ్యవహారాలను ఇరు వర్గాలు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇరు పార్టీలను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.