Don't Miss!
- News ఎన్నికల ముందు గుడ్ న్యూస్..ఫుల్ జోష్లో వైసీపీ
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
షకీలా మళ్లీ విజృంభణ.. 250వ చిత్రంతో హంగామా.. రియల్ స్టోరి అట..
Recommended Video
షకీలా 250 వ చిత్రం 'శీలవతి' ఫస్ట్లుక్ విడుదల జీ స్టూడియోస్ పతాకంపై మలయాళం సూపర్ స్టార్ షకీలా హీరోయిన్గా, సాయిరాం దాసరి దర్శకత్వంలో రాఘవ ఎమ్. గణేష్, వీరు బాసింశెట్టిలు సంయుక్తంగా నిర్మించిన సైకలాజికల్ థ్రిల్లర్ 'శీలవతి'. ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా హైదరాబాద్లో శీలవతి మూవీ ఫస్ట్ లుక్ని విడుదల చేశారు.
షకీలా 250వ చిత్రం
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సాయిరాం దాసరి మాట్లాడుతూ.. ''మా హీరోయిన్ షకీలాకు ఇది 250వ చిత్రం. కేరళలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ అని అన్నారు.
అద్భుతంగా రీరికార్డింగ్
మా నిర్మాతలు గణేష్, వీరబాబు గారు ఇచ్చిన ప్రోత్సాహంతో అనుకున్న దానికంటే చాలా బాగా తెరకెక్కించగలిగాము. సంగీతానికి ప్రాధాన్యమున్న చిత్రమిది. ప్రజ్వల్ క్రిష్ అద్భుతమైన నేపథ్య సంగతాన్ని అందించారు. తప్పకుండా ఈ చిత్రం ప్రతిఒక్కరిని ఆలోచింపజేస్తుంది అని సాయిరాం దాసరి అన్నారు.
ఏప్రిల్లో రిలీజ్
నిర్మాతలలో ఒకరైన రాఘవ ఎమ్. గణేష్ మాట్లాడుతూ.. ''ఊహించిన దానికంటే ఈ చిత్రం బాగా వచ్చింది. ఈ రోజు నుంచి పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఏప్రిల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం.'' అన్నారు.
నిర్మాతగా మారుతున్నా
మరో నిర్మాత వీరు బాసింశెట్టి మాట్లాడుతూ.. ''చాలా సినిమాలకు పీఆర్వోగా, కొన్ని సినిమాలకు డిస్ట్రిబ్యూటర్గా, రెండు సినిమాలకు నిర్మాతకు వ్యవహరించిన నేను ఈ చిత్రంతో మళ్లీ నిర్మాతగా మారుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అని అన్నారు.
నటీనటులు, సాంకేతిక వర్గం
శీలవతి చిత్రంలో షకీలా, గీతాంజలి(ఫ్రూటీ), లడ్డు, అశోక్బాబు తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రజ్వల్ క్రిష్, కెమెరా: తరుణ్ కరమ్తోత్, డైలాగ్స్: యష్ యాదవ్, నిర్మాతలు: రాఘవ ఎమ్. గణేష్, వీరు బాసింశెట్టి, కథ-స్క్రీన్ప్లే-దర్శకత్వం: సాయిరాం దాసరి.