Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
డోంట్ రీడ్ దిస్...... హీరో ఉపేంద్ర మరో సెన్సేషన్!
కన్నడ నటుడు ఉపేంద్ర త్వరలో తన ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
కన్నడ నటుడు ఉపేంద్ర ఏ పని చేసినా సంచలనం అయ్యేలా చేస్తారు. ఆయన నటించిన కొన్ని సినిమా టైటిల్స్ గమనిస్తే..... ష్, ఎ, రా, హెచ్ టు ఓ ఇలా డిఫరెంటుగా ఉన్నాయి. త్వరలో ఉపేంద్ర తన ఆత్మకథ పుస్తకాన్ని రిలీజ్ చేయబోతున్నారు. దీనికి టైటిల్ కూడా విచిత్రంగా పెట్టారు.
'ఇదన్నా ఓడ్బేడి' అనే కన్నడ టైటిల్ తో ఈ పుస్తకం రిలీజ్ చేయబోతున్నారు. అంటే 'డోంట్ రీడ్ దిస్' (దీన్ని చదవొద్దు) అని అర్థం. త్వరలో ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడానికి ఉపేంద్ర ప్లాన్ చేస్తున్నారు.
ఈ పుస్తకంలో ఏముంటుంది?
ఉపేంద్ర జీవితంలోని ముఖ్య ఘట్టాలను ఫోకస్ చేస్తూ ఈ ఆటోబయోగ్రఫీ ఉండబోతోంది. ఉపేంద్ర రాజకీయాల్లో క్రీయాశీలకంగా మారుతున్న నేపథ్యంలో ఆయన పొలిటికల్ ఫ్యూచర్కు హెల్ప్ అయ్యేలా ఈ పుస్తకం ఉంటుందని భావిస్తున్నారు.
రాజకీయ పార్టీని స్థాపించిన ఉపేంద్ర
ప్రస్తుతం ఉపేంద్ర నటుడిగా వరుస సినిమాలు చేస్తున్నారు. దీంతో పాటు దర్శకుడిగా కూడా సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఓ వైపు ఇవి చేస్తూనే... ఇటీవలే ‘కర్నాటక ప్రగ్నాయవంత జనతా పక్ష' పేరుతో సొంతగా రాజకీయ పార్టీని స్థాపించారు.
గతంలో రెండు పుస్తకాలు రిలీజ్ చేసిన ఉపేంద్ర
గతంలో ఉపేంద్ర రెండు పుస్తకాలు విడుదల చేశారు. అయితే ఈ సారి పూర్తి స్థాయిలో తన ఆత్మకథను పుస్తకంలో పొందుపరచనున్నారు. మొత్తం 144 పేజీలతో ఈ పుస్తకం ఉండబోతోంది. ఈ ఆటోబయోగ్రఫీ కోసం అభిమానులు, కన్నడ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పొలిటికల్ మైలేజ్ కోసమేనా?
రాజకీయ పార్టీని స్థాపించిన కొద్దిరోజుల్లోనే ఉపేంద్ర తన ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని లాంచ్ చేయడం చర్చనీయాంశం అయింది. పొలిటికల్ మైలేజ్ కోసమే ఉపేంద్ర ఇపుడు ఈ పుస్తకాన్ని లాంచ్ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.