Don't Miss!
- News పడమర దిక్కు తల పెట్టుకుని పడుకోవడం మంచిదేనా..?
- Sports Hardik Pandya: అస్సలు ఊహించలేదు.. ఆ తప్పిదమే మా కొంపముంచింది!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ తప్పులను నిర్లక్ష్యం చేసిన వారు జీవితంలో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంటారు...!
- Automobiles కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ బసాల్ట్ విజన్ ఎస్యూవీని ఆవిష్కరించిన సిట్రోయెన్
- Technology WhatsApp ద్వారా విదేశాలకు డబ్బు పంపేందుకు కొత్త ఫీచర్! వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
సుద్దాలకు సర్జరీ.. చిరు మాటలే కొండంత ధైర్యం.. అసలు విషయం చెప్పిన ఉత్తేజ్
సోషల్ మీడియా కాలంలో ఏది నిజమో ఏది అబద్దమో వెంటనే నమ్మేందుకు వీలు లేదు. ఏదైనా సరే అది ఏ విషయమైనా సరే అధికారిక వ్యక్తులు తమంతట తాము స్పందిస్తే గానీ ఆ వార్తలకు విలువ ఉండదు. నిన్న, మొన్న ప్రసిద్ద గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఆరోగ్యంపై వార్తలు వచ్చాయి. వాటిని కొందరు సినీ ప్రముఖులు ఖండించారు. అయితే తాజాగా నటుడు ఉత్తేజ్ ఆ వార్తలపై స్పందిస్తూ అదంతా నిజమేనని క్లారిటీ ఇచ్చాడు. అసలు ఏం జరిగిందో ఓ వీడియో ద్వారా వివరించాడు.
ఆ ప్రకటనతో ఓ క్లారిటీ
మొదటగా సుద్దాల ఆరోగ్య విషయమై కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మొదట అవన్నీ అబద్దమని కొట్టిపారేశారు. అయితే సుద్దాల అశోక్ తేజకే ఆరోగ్యం బాగా లేదని, ఆయనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగనున్నట్లుగా చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఓ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు సుద్దాల అశోక్ తేజకి వరసకి అల్లుడైన్ ఉత్తేజ్ ఆయన ఆరోగ్యంపై వివరణ ఇచ్చాడు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశాడు.
ఆ వార్తలు నిజమే..
ఉత్తేజ్ మాటల సారాంశం.. నమస్తే.. సుద్దాల అశోక్ తేజగారు మా మామయ్య. లిరిసిస్ట్ అనే విషయం అందరికీ తెలుసు. తను అనారోగ్యంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో వస్తుంది. అది నిజమే. అయితే ఆయన ఈరోజు(మే 22) హాస్పటల్లో జాయిన్ అవుతున్నారని. రేపు (23) సాయంత్రం సర్జరీ ఉందని క్లారిటీ ఇచ్చాడు.
అలా వైరల్ అయింది..
ఆయన తన ఫ్రెండ్తో బ్లడ్ అవసరం ఉంటుందేమో అని చెబితే.. అతను ఫేస్బుక్లో పెట్టేశాడని చెప్పుకొచక్చాడు. దాంతో అలా సోషల్ మీడియా మొత్తం మామయ్య ఆరోగ్యం గురించి రకరకాలుగా వచ్చాయాని, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని చెప్పుకొచ్చాడు. కానీ ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని మరోసారి వివరంగా చెప్పాడు.
రక్తం అవసరం ఏర్పడింది..
రక్తం అవసరం ఏర్పడటంతో వెంటనే తాను చిరంజీవి బ్లడ్ బ్యాంక్కు ఫోన్ చేశానని తెలిపాడు. అక్కడ స్వామినాయుడు, ముఖేష్ వెంటనే రియాక్ట్ అయ్యారని చెప్పుకొచ్చాడు. బ్లడ్ డొనేటర్స్ని పంపించడం కూడా జరిగిందని పేర్కొన్నాడు. మామయ్య మీద గౌరవంతో, ప్రేమతో ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి అడిగిన వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అని తెలిపాడు.
వెంటనే చిరంజీవి స్పందించారు..
వెంటనే అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు ఈ విషయం తెలియడంతో మార్నింగ్ ఫోన్ చేసి మామయ్యకు ఎలా ఉందని కనుక్కున్నారని తెలిపాడు. వీలైతే మామయ్యతో మాట్లాడించు అని చెప్పారని పేర్కొన్నాడు. తాను వెంటనే మామయ్యతో అన్నయ్య చిరంజీవితో మాట్లాడించానని తెలిపాడు. అన్నయ్య మాటలు మామయ్యకు కొండంత ధైర్యాన్ని, కొండంత నమ్మకాన్ని కలిగించాయని అన్నాడు.
కొండంత ధైర్యం వచ్చిందన్నారు..
చిరంజీవితో మాట్లాడిన అనంతరం.. టోటల్ పరిశ్రమే తనతో మాట్లాడినట్లుగా, ఎంతో ధైర్యంగా హాస్పటల్కు వెళుతున్నానురా అని సుద్దాల పేర్కొనట్టు ఉత్తేజ్ తెలిపాడు. చిరంజీవి సహృదయతకు కృతజ్ఞుడిని, సుద్దాల అశోక్ తేజగారు చాలా ఆరోగ్యంగా ఉన్నారని, మనందరి అభిమానం, ప్రేమతో ఆయన హ్యాపీగా బయటికి వచ్చి మళ్లీ బోలెడన్ని పాటలు రాస్తారని కోరుకుందామని జరిగిన కథ అంతా వివరించాడు.