Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బ్రేకింగ్: నటుడు ఉత్తేజ్ భార్య కన్నుమూత.. ఎలా చనిపోయారంటే?
టాలీవుడ్ను మరో విషాదం వెంటాడింది. ప్రముఖ నటుడు ఉత్తేజ్ సతీమణి పద్మావతి క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ చివరి శ్వాస విడిచారు. దాంతో ఉత్తేజ్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పుట్టెడు దు:ఖంలో ఉన్న ఉత్తేజ్కు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఉత్తేజ్ భార్య పద్మావతి గురించి మరికొన్ని విషయాలు..
Recommended Video
Uttej Wife Padmathi కన్నుమూత: విషాదంలో సినీ ప్రముఖులు.. చిరంజీవి, ప్రకాశ్ రాజ్ కంటతడి (ఫోటోలు)
క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ..
నటుడు ఉత్తేజ్ సతీమణి పద్మావతి కొద్ది రోజులుగా క్యాన్సర్ వ్యాధితో అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. క్యాన్సర్ వ్యాధితో ఆరోగ్యం మరింత క్షీణించి సోమవారం (సెప్టెంబర్ 13వ తేదీ) రోజున ఉదయం 8 గంటల ప్రాంతంలో మరణించారు.
చిరంజీవి, ఇతర సినీ ప్రముఖుల పరామర్శ
ఉత్తేజ్కు సతీవియోగం సంభవించిందని తెలుసుకొన్న సినీ ప్రముఖులు ఆయనను పరామర్శించారు. ఉత్తేజ్ను పరామర్శించిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్, జీవిత రాశేఖర్ పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు. పద్మావతి మరణవార్తను తెలుసుకోగానే సినీ ప్రముఖులంతా బసవతారకం హాస్పిటల్కి వెళ్లి ఉత్తేజ్ కుటుంబాన్ని పరామర్శించారు.
ఉత్తేజ్ యాక్టింగ్ ఫిల్మ్ స్కూల్లో కీలకంగా
ఉత్తేజ్ భార్య పద్మావతి విషయానికి వస్తే.. ఉత్తేజ్ స్థాపించిన యాక్టింగ్ స్కూల్లో కీలక పాత్ర పోషించారు. ఉత్తేజ్ యాక్టింగ్ స్కూల్ పాలన వ్యవహారాలను ఆమె చూసుకొనే వారు. ఉత్తేజ్ యాక్టింగ్ ఫిల్మ్ స్కూల్ నడిపించడంలో ఆమె సంయమనంగా వ్యవహరించే వారని సినీ ప్రముఖులు చెప్పుకొంటారు.
భార్య పద్మావతి గురించి ఉత్తేజ్
అయితే తన భార్య పద్మావతి గురించి ఉత్తేజ్ గొప్పగా చెప్పుకొంటారు. ఉత్తేజ్ యాక్టింగ్ ఫిల్మ్ స్కూల్ ఏదైనా మంచి ప్రశంసలు అందుకొన్నదంటే తన భార్య పద్మావతి కృషి చాలా ఉంది. అందుకు ఆమెకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. రోజుకు వందలాది ఫోన్లు వచ్చేవి. మొదటి కాల్ నుంచి 100వ కాల్ వరకు ఆమె చాలా కూల్గా అందరికి సమాధానం చెప్పేది. యాక్టింగ్ స్కూల్లో క్రమశిక్షణ, మంచి వాతావరణం ఉండేందుకు మంచి చర్యలు, ప్లానింగ్ చేసింది అని ఉత్తేజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
|
చిరంజీవి సంతాపం.. ఎమోషనల్గా
ఉత్తేజ్కు సతీ వియోగం నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేశారు. ఉత్తేజ్ భార్య ఈ రోజు ఉదయం క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి మనోధైర్యం భగవంతుడు ఇవ్వాలి. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం అంటూ ట్వీట్లో పేర్కొన్నారు.
సోమవారం మధ్యాహ్నం అంత్యక్రియలు
ఉత్తేజ్ సతీమణి పద్మావతికి సోమవారమే అంత్యక్రియలు నిర్వహిస్తారు అని సినీ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్ 13వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మహాప్రస్థానంలో జరగనున్నాయని మా అసోసియేషన్ సభ్యులు, సినీ వర్గాలు ఓ ప్రకటలో తెలిపాయి. ఉత్తేజ్ భార్య ఇకలేరనే విషయాన్ని తెలుసున్న సినీ ప్రముఖులు స్వయంగా వచ్చి సంతాపం తెలపడమే కాకుండా ఫోన్లో, సోషల్ మీడియాలో ద్వారా వ్యక్త పరుస్తున్నారు.
ఉత్తేజ్ కుటుంబం గురించి
ఉత్తేజ్, పద్మావతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు పాట, రెండో కూతురు చేతన. కూతురు పాట రంగస్థలం చిత్రం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. చేతన కూచిపూడి డ్యాన్సర్గా సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ సంపాదించుకొన్నారు. 2018లో రవిరాజ్ అనే యువకుడితో చేతన వివాహం జరిగింది.