Don't Miss!
- Sports KKR vs RR: కొంపముంచిన హర్షిత్ రాణా.. రాజస్థాన్ను గెలిపించిన బట్లర్!
- News బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Automobiles ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
Venu Madhav జ్ఞాపకాలను నెమరు వేసుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి.. మొదటిసారి చూసింది అక్కడే!
ప్రముఖ నటుడు, టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ మృతి చెందారనే వార్త యావత్ సినీ లోకాన్ని శోకసంద్రంలోకి నెట్టివేసింది. ఆయన మరణవార్త తెలుసుకొని టాలీవుడ్ ప్రముఖులు తమ తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అతనితో చేసిన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా వేణుమాధవ్ మృతిపై సీనియర్ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి స్పందించారు.
టాలీవుడ్ చిత్రసీమలో విషాద ఛాయలు
కాలేయం, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న వేణుమాధవ్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతితో టాలీవుడ్ చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓ మంచి మనిషిని టాలీవుడ్ చిత్రసీమ కోల్పోయిందని కలత చెందుతున్నారు సినీ ప్రముఖులు.
Recommended Video
ఎస్వీ కృష్ణారెడ్డి ద్వారానే పరిచయం
వేణుమాధవ్ సినీ ప్రయాణం దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తోనే మొదలైంది. 1996 సంవత్సరంలో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'సంప్రదాయం' సినిమాతో వెండితెరపై కాలుమోపారు వేణు మాధవ్. అనతి కాలంలోనే స్టార్ కమెడియన్గా పేరు తెచ్చుకున్న ఆయన అందరు అగ్ర హీరోలతో తెర పంచుకున్నారు.
మొదటిసారి అక్కడే చూశా..
వేణుమాధవ్ మృతి పట్ల స్పందించిన ఎస్వీ కృష్ణారెడ్డి.. అతన్ని తొలిసారి ఓ థియేటర్ లో చూశానని చెప్పారు. వేణుమాధవ్ చాలా టాలెంట్ ఉన్న కమెడియన్ అని. పని పట్ల ఆయనకు ఏకాగ్రత ఎక్కువగా ఉండేదని చెప్పారు. నిన్న రాత్రే ఆయన్ను హాస్పిటల్ లో చూశానని ఇంతలోనే ఆయన మృతి చెందడం బాధగా ఉందని, ఓ మంచి కమెడియన్ని మిస్ అయ్యామని అన్నారు.
మొదటి నుంచి చివరి వరకు
తన సినీ ప్రయాణంలో మొదటి నుంచి చివరి వరకు వేణు మాధవ్ చాలా యాక్టీవ్ గా పని చేశారని అన్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. చివరిసారిగా అతన్ని ఓ ఫంక్షన్ లో కలిశానని అన్నారు. తన ఆరోగ్యం బాగా లేదని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. వేణు మాధవ్ లాంటి టాలెంటెడ్ వ్యక్తి మరణం టాలీవుడ్ చిత్రసీమకు తీరని లోటు అని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
వేణు మాధవ్ సినిమాలు
ప్రియమైన నీకు, ఆది, సొంతం, తొలిప్రేమ, సింహాద్రి, సై, ఛత్రపతి, దిల్, సాంబ, వెంకీ, తమ్ముడు, పోకిరి, ఖతర్నాక్, యోగి, దేశముదురు, సంక్రాంతి, మాస్, అతనొక్కడే తదితర సినిమాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకుల మన్ననలు పొందారు వేణు మాధవ్. పలు టీవీ షోల్లో హోస్ట్ గా కూడా చేశారు.