Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కారుతో హీరో విక్రమ్ కుమారుడి వీరంగం... ముగ్గురికి తీవ్ర గాయాలు, కేసు నమోదు (ఫోటోస్)
Recommended Video
ప్రముఖ సౌత్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ తన కారుతో వీరంగం సృష్టించాడు. మితిమీరిన వేగంతో రాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ ఘటనతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ యాక్సిడెంట్లో అతడితో కారుతో పాటు మూడు ఆటో పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
యాక్సిడెంట్: హీరో విక్రమ్ కొడుకు పరుగో పరుగు... వీడియో వైరల్!
లగ్జరీ కారులో స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ
ఆదివారం తెల్లవారు ఝామున ధృవ్ తన లగ్జరీ కారులో తన ముగ్గురు స్నేహితులతో కలిసి ప్రయాణం చేస్తుండగా తైనంపేట్ పోలీస్ కమీషనర్ ఇంటి సమీంలోకి వచ్చిన తర్వాత అదుపు తప్పింది. వేగంగా వెళుతూ అక్కడ రోడ్డు పక్కన నిలిచిన ఆటోరిక్షాలను ఢీకొట్టింది.
ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలు
ఈ ప్రమాదంలో ఆటోలో నిద్రిస్తున్న డ్రైవర్ గాయాలపాలయ్యాడు. అతడితో పాటు ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ కాలుకు ఫ్యాక్చర్ కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు
విషయం తెలుసుకున్న పాండీ బజార్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ధృవ్ కారు స్వాధీనం చేసుకోవడంతో పాటు అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందనే విషయమై దర్యాప్తు జరుపుతున్నారు.
అర్జున్ రెడ్డి రీమేక్ ద్వారా
ధృవ్ త్వరలో ‘వర్మ' అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం కాబోతున్నాడు. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘అర్జున్ రెడ్డి'కి ఇది రీమేక్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.