Don't Miss!
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సౌందర్య తలరాత మార్చేశాడు, అందుకే ఆమె నాకు ఫ్రెండ్.. డైరెక్టర్కి కావలసింది చేసిపెడుతున్నారు!
90 వ దశకంలో నటి ఆమని హీరోయిన్ గా టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది. హోమ్లీ క్యారెక్టర్స్ కు ఆమని పెట్టింది పేరు. శుభలగ్నం, మిస్టర్ పెళ్ళాం, జాంబ లకడి పంబ వంటి హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 60 కి పైగా చిత్రాల్లో ఆమని నటించారు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా క్యరెక్టర్ రోల్స్ లో దూసుకుపోతున్నారు. ఇటీవల జరిగిన ఇంటర్వూలో ఆమని తన సినీ జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Recommended Video
సౌందర్య మంచి స్నేహితురాలు
తనకు చిత్ర పరిశ్రమలో సౌందర్య మంచి స్నేహితురాలుగా ఉండిందని ఆమని అన్నారు. ఇద్దరం కర్ణాటక నుంచి రావడం వలన ఫ్రెండ్ షిప్ ఏర్పడిందని, తామిద్దరం 4 చిత్రాల్లో కలసి నటించాం అని ఆమని గుర్తు చేసుకున్నారు.
తలరాత మార్చేశాడు
సౌందర్య పిన్నవయసులోనే మరణించిందని అన్నారు. దేవుడే ఆమె తలరాత ఆవిధంగా మార్చేశాడని అన్నారు. సంతోషంగా వైవాహిక జీవితం గడుపుతున్న తరుణంలో సౌదర్యం మరణించడం బాధాకరం అని ఆమని అన్నారు.
జగపతి బాబుతో
టాలీవుడ్ లో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ తో కలసి మంచి చిత్రాల్లో నటించానని అన్నారు. వాళ్ళిద్దరితో అనుబంధం మరచిపోలేనని ఆమనీ తెలిపారు.
ఆ నలుగురు
సెకండ్ ఇన్నింగ్స్ లో ఆ నలుగురు చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని ఆమని తెలిపారు. ఈ రోల్ మొదట భానుప్రియకు వచ్చింది. డేట్స్ కుదరకపోవడంతో నన్ను సంప్రదించారు. తల్లి పాత్ర కావడంతో మొదట ఒప్పుకోలేదు. కానీ కథ విన్నాక అంగీకరించానని ఆమని తెలిపింది.
ఇప్పుడున్న జనరేషన్ అంతే
ప్రస్తుతం ఉన్న ట్రెండు కు తగ్గట్లుగానే హీరోలు, హీరోయిన్లు ఉంటున్నారని ఆమని తెలిపింది. డైరెక్టర్స్ కు కావలసింది మాత్రమే వాళ్ళు చేస్తున్నారని తెలిపింది.