Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గుడ్ న్యూస్: హీరోయిన్ అంకితకు కంగ్రాట్స్ చెబుతున్న ఫ్యాన్స్!
లాహిరి లాహరి లాహరిలో, సింహాద్రి ఫేమ్ అంకిత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
లాహిరి లాహిరి లాహిరిలో, సింహాద్రి సినిమాల ద్వారా పాపులర్ అయిన హీరోయిన్ అంకిత అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకుని సెటిలైన సంగతి తెలిసిందే. ఎన్ఆర్ఐ బిజినెస్మేన్ విశాల్ జగ్తాప్ను ఆమె పెళ్లాడారు.
2016 మార్చిలో విశాల్ జగ్తాప్, అంకిత వివాహం జరిగింది. తాజాగా ఈ దంపతులు తల్లిదండ్రులయ్యారు. అంకిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్ న్యూస్ అభిమానులతో పంచుకుంటూ బిడ్డతో కలిసి దిగిన ఫోటోను విశాల్ జగ్తాప్-అంకిత దంపతులు షేర్ చేశారు.
అంకిత అభిమానులు, సన్నిహితులు, ఇండస్ట్రీకి చెందిన స్నేహితులు ఈ గుడ్ న్యూస్ తెలిసిన వెంటనే ఈ దంపతులకు కంగ్రాట్స్ చెబుతూ సోషల్ మీడియాలో సందేశాలు పోస్టు చేస్తున్నారు.
పూణే కు చెందినా విశాల్ జగ్తాప్తో అంకితకు అమెరికాలో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇరువురు పెద్దల అంగీకారంతో గతేడాది మార్చ్ 28న ఒక్కటయ్యారు.