హీరోయిన్లు- చదువు సంధ్యలు!
సినిమా హీరోయిన్లు అనగానే వారి హావభావాలను, కుర్రవాళ్ళైతే ఎత్తు పల్లాలు తరచి చూస్తారు. వాళ్ళు ఏం చదువుకుని వెండితెరకు వచ్చారు, ఇంకా వాళ్ళు చదువులు కొనసాగిస్తున్నారా అని ఆలోచించే వాళ్ళు తక్కువ. ఎవరేం చదువుకున్నారో చదవండి.
త్రిష బిఎ డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం సైనికుడులో నటిస్తున్న ఆమె ఆ తర్వాత చిరంజీవి స్టాలిన్ పాటల్లో, ఆ తర్వాత సెల్వరాఘవన్ దర్శకత్వంలో వెంకటేష్ సరసన నటించనుంది. నయనతార ఇంటర్మీడియట్ నుంచి నేరుగా సిఎ చదువుతోంది. ఒక చార్టర్డ్ అకౌంటెంట్ రెండేళ్ళకు సంపాదించే మొత్తాన్ని రెండు నెలల్లో సంపాదించగల నయనతార సిఎ చేయాల్సిన అవసరముందా? అది వేరే విషయమనుకోండి. టీనేజ్ సంధ్య ఇంకా టెన్త్ క్లాస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. బెంగుళూరుకు చెందిన పద్మప్రియ ఎంబిఎ పూర్తి చేసింది. సోనియా అగర్వాల్ బీకాం చదువుకుంది. టెన్ ్రస్టేంజర్స్ ఫేం జ్యోతిర్మయికి జర్నలిజంలో పీజీ డిప్లొమా ఉంది.


Click it and Unblock the Notifications