Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
డైరక్టర్ ని చెప్పుతో కొట్టిన హీరోయిన్...అరెస్ట్
బెంగళూరు : మీడియా ప్రతినిధుల సమక్షంలో హీరోయిన్, దర్శకుడు ఘర్షణ పడ్డారు. ఒక దశలో హీరోయిన్ కోపంతో చెప్పుతో దర్శకుడుపై దాడి చేసింది. ఇద్దరూ పోలీసు స్టేషన్ మెట్లెక్కారు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసారు. బెంగుళూరులో నిన్న(శనివారం) సాయింత్రం జరిగిన ఈ వివాదం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఆ హీరోయిన్ పేరు నయనకృష్ణ. దర్శకుడు పేరు రుషి. దర్శకుడే నిర్మాత కావటం ఈ వివాదానికి దారి తీసింది. తనకు రావాల్సిన రెమ్యునేషన్ సెటిల్ చెయ్యకుండా ఇలా మీడియా సమావేశం ఏర్పాటు చేయటం ఆమెకు ఆవేశం తెప్పించింది.
వివరాల్లోకెళ్తే.... కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ధనుష్, నయన కృష్ణ జంటగా నటించిన కై కోట్టప్పా కై అనే చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆ చిత్ర యూనిట్ బెంగళూరు గాంధీనగరలో శనివారం నిర్వహించిన ప్రెస్మీట్ హాట్ గా మారింది. నటి నయన కృష్ణ చిత్ర ద ర్శకుడు రుషిపై చెప్పుతో దాడి చేసింది. ఆమెతో పాటు వచ్చిన కొందరు మహిళలూ ఆయన పై దాడి చేశారు. తీసుకున్న అప్పు తీర్చకుండా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ వారీ దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను,ఆమె అసెస్టెంట్ అనితను పోలీసులు అరెస్టు చేసారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదల చేసారు.
'కొట్లల్లప్పో కై' సినిమా వివరాల్ని తెలిపేందుకు శనివారం మధ్యాహ్నం ఇక్కడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హీరోయిన్ నయనకృష్ణ, హీరో ధనుష్, దర్శకుడు, నిర్మాతల్లో ఒకరైన రుషి ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. మీడియా సమావేశం కొనసాగుతుండగానే తనకు రావాల్సిన పారితోషికం బకాయిల గురించి నయన కృష్ణ ప్రస్తావించింది. అందుకు దర్శకుడు రుషి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఇద్దరి మధ్య గలాటా మొదలైంది. తనకు రూ. ఎనిమిది లక్షలు రావాలని, వాటిని వెంటనే అందచేయాలి, లేని పక్షంలో సినిమా పంపిణీ హక్కుల్ని ఇవ్వాలని డిమాండ్ చేసింది. అందుకు రుషి నిరాకరించడంతో ఘర్షణ పడ్డారు. తరువాత ఇద్దరూ దగ్గర్లోని ఉప్పారపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ ఘటన సినీవర్గాల్లో కలకం సృష్టించింది. వారిద్దరి వైఖరిని సీనియర్లు తప్పుబట్టారు. ఆర్థిక లావాదేవీల్ని నాలుగు గోడల నడుమ పరిష్కరించుకోవడం మాని వీధిన పడ్డారని నిర్మాతల సంఘం అధ్యక్షుడు మునిరత్న విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటన వల్ల సినిమా పరువు బజారున పడిందని వాపోయారు. ఇకముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామన్నారు.