Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ టైపు కాదు, అందుకే ఇరికించారు: నటి కళ్యాణి
హైదరాబాద్: తెలుగు సినీ నటి కళ్యాణి అలియాస్ కరాటే కళ్యాణి వనస్థలిపురంలో కొంత మంది పురుషులతో కలిసి పేకాట ఆడుతూ పట్టుబడ్డ సంగతి తెలిసిందే. దీంతో ఆమె కేవలం పేకాట ఆడటానికే అక్కడికి వెళ్లిందా? లేక మరేదైనా అసాంఘీక కార్యకలాపాలు అక్కడ జరుగుతున్నాయా? అనే అను మానాలు వ్యక్తం చేస్తూ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో ఆమె మీడియా ముందుకొచ్చి స్పందించారు. తనను ఎవరో కావాలనే పేకాట కేసులో ఇరికించారని కళ్యాణి ఆరోపించారు. హరికథ కళాపీఠం ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో తన కార్యాకలాపాలను ఆపాలని కొందరు కుట్ర చేసి ఇరికించారన్నారు. పేకాట ఆడుతున్న పెద్ద మనుషులను ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నించారు.
తనకు పేకాట ఆడే అలవాటు ఉందని, అందులో తప్పుంటే కోర్టు తనకు శిక్ష వేస్తుందని అన్నారు. అంతేకానీ దాన్ని ఆధారంగా చేసుకుని మీడియాలో ఇతరత్రా అనుమానాలు వచ్చేలా ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయవద్దని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్ల నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్న తనపై లేనిపోని నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.