Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అందుకే డ్రగ్స్ ఆరోపణలు వచ్చిఉంటాయ్: పూరీ పై హీరోయిన్ పంచ్
అభిమానుల్ని బాలయ్య కొట్టడంలో తప్పు లేదన్నట్లు పూరి మాట్లాడుతున్నాడని, పూరి మీద ఘాటైన సెటైర్లు వేసింది కస్తూరి .
"రజనీ తప్ప మీకు మిగతా విషయాలు పట్టవా? ఆయన రాజకీయాగమనం గురించి మాత్రమే ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు? తమిళ ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలేవీ కనిపించడం లేదా?" అంటూ తమిళ, జాతీయ మీడియాలపై సెటైర్ వేసి రజినీ అభిమానులనుంచి పెద్ద వ్యతిరేకతనే ఎదుర్కొన్న నటి కస్తూరి ఈసారి టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని టార్గెట్ చేసుకొని మరీ పంచ్ లు విసిరింది...
నందమూరి బాలకృష్ణ ఓ అభిమానిని కొట్టడం గురించి 'పైసా వసూల్' ఆడియో వేడుకలో పూరి జగన్నాథ్ స్పందిస్తూ.. అది బాలయ్యకు, అభిమానులకు మధ్య లవ్ స్టోరీ అని.. దాన్ని మరోలా అర్థం చేసుకోవద్దని కవర్ చేసే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కస్తూరి స్పందిస్తూ.. పూరి మీద ఘాటైన సెటైర్లు వేసింది.
అభిమానుల్ని బాలయ్య కొట్టడంలో తప్పు లేదన్నట్లు పూరి మాట్లాడుతున్నాడని.. దీన్ని బట్టి చూస్తే పూరి మీద డ్రగ్స్ ఆరోపణలు ఏ ఆధారాలు లేకుండా రాలేదని తెలుస్తోందన్నట్లుగా కస్తూరి వ్యాఖ్యానించడం విశేషం. బాలయ్య విషయంలో పూరి చేసిన సమర్థన పట్ల విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి వాస్తవమే.
ఐతే ఈ వ్యవహారంలో మన సెలబ్రెటీలెవ్వరూ కూడా పెదవి విప్పలేదు. అందరూ సైలెంటుగా ఉన్నారు. ఐతే తెలుగు సినిమాతో ఎప్పుడో కనెక్షన్ కట్ అయిపోయిన కస్తూరి.. అనూహ్యంగా దీనిపై స్పందించడం.. పూరి మీద ఇలా కౌంటర్ వేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే.