Don't Miss!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్లో IPL మ్యాచ్లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కారు డ్రైవర్ తో ...సినీనటి కవిత కుమార్తె ప్రేమ వివాహం
వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రానికి చెందిన రాజ్కుమార్(28) మూడేళ్లుగా సికింద్రాబాద్లో ఉంటూ మాధురి కారు డ్రైవరుగా పనిచేస్తున్నాడు. ఎంబీఏ చదువుతున్న మాధురిని కాలేజీకి తీసుకువెళుతున్న క్రమంలో ఇద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యం ప్రేమకు దారితీసింది.
వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో వారు అడ్డుచెప్పారు. ఈక్రమంలో రెండు రోజుల కిత్రం ఇంటి నుంచి వెళ్లిపోయిన మాధురి గురువారం మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో రాజ్కుమార్తో కలిసి ప్రత్యక్షమయ్యారు. దళిత నేతల సమక్షంలో వెంకటేశ్వరాలయంలో వివాహం చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిద్దరిని పోలీస్స్టేషన్కు తరలించారు.
మాధురి బంధువుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పంజాగుట్ట ఠాణాలో రాజ్కుమార్పై కేసు నమోదైంది. దీంతో పంజాగుట్ట పోలీసులు పెద్దపల్లికి వచ్చి అతడిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించారు. ఈ సందర్భంగా మాధురి మీడియాతో మాట్లాడుతూ.. తమ పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించరనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి, వివాహం చేసుకున్నామని తెలిపారు.